మోహన్ బాబు వారసురాలిగా సినీపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి ఆ తరువాత తనకంటూ పత్ర్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. నటిగా, టీవీ షో హోస్ట్గా, నిర్మాతగా విజయాన్ని అందుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మంచులక్ష్మి ట్రోలర్ల విషయంలో దూకుడుగా ఉంటుంది. వాళ్ల తీరును ఎండగట్టేందుకు అసలేమాత్రం సంకోచించదు. అయితే, తాజాగా ప్రజల సాయం అర్థిస్తూ మంచు లక్ష్మి పెట్టిన పోస్టు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మంచు లక్ష్మి తన కుమార్తె విషయంలో సాయం కోరుతూ చేసిన
పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తన కుమార్తె కోసం అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలని కోరింది. తన కూతురికి పాఠశాల సెలవులు త్వరలోనే ముగియనున్నాయని ఇన్స్టా వేదికగా తెలిపింది. ఈమేరకు మంచు లక్ష్మి ‘‘నా అమెరికా వీసా ఒక నెల క్రితమే ఆమోదించారు. కానీ ఇప్పటి వరకు అది నాకు అందలేదు. నా కూతురు స్కూల్ హాలీడేస్ ముగిశాయి. నేను వెళ్లాల్సిన ప్లైట్ జూన్ 12న ఉంది. నాకు వీసా ఇంకా అందలేదు. ఎంబసీ వెబ్సైట్ డౌన్ కావడంతో.. వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే రెండు నెలలు
దాటింది. దయచేసి ఎవరైనా స్పందించి సహాయం చేయగలరా’’అంటూ పోస్ట్ చేసింది. మంచు లక్ష్మీ షేర్ చేసిన పోస్ట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మంచు లక్ష్మీ వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్ళికి హాజరయ్యింది. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేసింది లక్ష్మీ. కాగా మంచు లక్ష్మీ ల విషయానికొస్తే ఇటీవలే యక్షిణి అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇక సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ మీద వచ్చినన్న ట్రోల్స్ ఎవరి మీద రావు. మంచు లక్ష్మిని కూడా చాలా మంది ట్రోల్ చేస్తారు. కానీ వాటిని పెద్దగా పట్టించుకోదు...!!