ఉస్తాద్ భగత్ సింగ్.. ఆగిపోవడంపై డైరెక్టర్ షాకింగ్ రియాక్షన్..!
అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాలు తీయడానికి కొంత సమయం పడుతుందని ఈ విషయాన్ని నిర్మాతలకు కూడా తెలియజేశానని చెప్పారు. దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ తాజాగా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయిందనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. గతంలో వీరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఉస్తాద్ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతమేరకు పూర్తి అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయిందా అంటూ పోస్ట్ పెట్టగా డైరెక్టర్ హరిశంకర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సినిమా స్టార్ట్ అవ్వదు అన్నప్పుడే రూమర్స్ పట్టించుకోలేదు. ఇప్పుడు రూమర్స్ చదివే సమయం లేదు అంటూ రాసుకు వచ్చాడు మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏ విధంగా ఆగిపోలేదని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది అలాగే దేవిశ్రీప్రసాద్ కూడా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ ఉండగా బారి బడ్జెట్కు పెట్టింది పేరు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.