ఆసక్తిరేపుతున్న జేజమ్మ లవ్ ట్రాక్..!

murali krishna
అనుష్క శెట్టి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించింది. మొదట్లో కాస్త గ్లామర్ ఎక్కువ ఉన్న రోల్స్ చేసినా నెమ్మది నెమ్మదిగా ఆమెకు కథా ప్రధాన్యమున్న సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో, మల్లెమాల నిర్మాణంలో వచ్చిన అరుంధతి సినిమా ఆమె సినీ కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పింది.ఈ సినిమాతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా నుంచి అనుష్కను ఎలా పడితే అలా చూపించడం మానేశారు దర్శకులు. దీంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఈమెకు హీరోలతో సమానంగా ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక బాహుబలిలో దేవసేన పాత్ర.. ఆమెకు మరో మైలురాయిగా చెప్పోచ్చు. ఆ సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా నటిగా మారింది అనుష్క. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ అమ్మడు గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. చాలా రోజుల తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఓ కొత్త మూవీ ప్రకటించింది. అలాగని సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉండట్లేదు. పూర్తిగా అన్నింటికీ దూరమై ఇంట్లోనే ఉంటుంది. అయితే గతంలో రెబల్ట్ స్టార్ ప్రభాస్‌తో అనుష్క రిలేషన్ నడుపుతోందని తెగ వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని అర్థం అవుతుంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో కంటే ముందు మరో ముగ్గురు స్టార్స్‌తో ఎఫైర్ నడిపినట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
స్వీటీ తన కెరీర్‌లో స్టార్ హీరోస్‌తో పాటుగా, ఓ సినిమాటోగ్రాఫర్‌తో కూడా ఎఫైర్స్ నడిపారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే హీరో గోపీచంద్‌తో లవ్ ట్రాక్ నడిపారనే వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లక్ష్యం', 'శౌర్యం' సినిమాల్లో వీరు కలిసి నటించి హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. అయితే ఈ పుకార్లకు వీరిద్దరూ స్పందించలేదు. కాగా 2013లో గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలిని వివాహం చేసుకోవడంతో ఈ రూమర్స్‌కి చెక్ పడింది. అదేవిధంగా అనుష్క నాగార్జునతో మంచి అనుబంధం కలిగి ఉంది. వీరి కాంబోలో 'సూపర్', 'కింగ్', 'డమరుకం' ఇలా చాలా సినిమాలే వచ్చాయి. అయితే 'కింగ్' సినిమాలో నాగార్జున కోసం అనుష్క స్పెషల్ సాంగ్ చేయడంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని పుకార్లు వచ్చాయి. అయితే కొద్ది రోజులకు వీటికి కూడా బ్రేక్ పడింది. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్, అనుష్క శెట్టి కూడా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి. సెంథిల్ పెద్దవాళ్లతో మాట్లాడి స్వీటీని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. ఆ తర్వాత సెంథిల్ రూహి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా ప్రభాస్, నాగార్జున, గోపీచంద్, సెంథిల్ కుమార్‌లతో అనుష్క ఎఫైర్ నడిపారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ ఈ పుకార్లు షికార్లు కొడుతూనే ఉన్నాయి. చూడాలి మరి వీటిపై అనుష్క ఎప్పటికైనా స్పందిస్తుందేమో అని..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: