అయ్యో: నందమూరి తారకరత్న భార్యకు ఇన్ని కష్టాలా..!

Divya
గడిచిన కొన్ని నెలల క్రితం నందమూరి హీరో తారకరత్న మరణం ఒక్కసారిగా అభిమానులను కలిసి వేసింది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడంతో ఆయన కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చారు. నారా లోకేష్ 2023లో యువగళం పేరుతో మొదలుపెట్టిన పాదయాత్రలో భాగంగా కుప్పకూలి దాదాపుగా కొన్ని రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించారు. తారకరత్న 2002లో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. తన మొదటి సినిమా ఒకటో నెంబర్ కుర్రాడు ఈ సినిమా తో పర్వాలేదు అనిపించుకున్న తారకరత్న ఏకంగా తొమ్మిది సినిమాలను లాంచ్ చేశారు.

అయితే సరైన కథలు ఎంపిక విషయంలో తగిన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఒక్కసారిగా ఆయన గ్రాఫ్ పడిపోయింది. 2012లో తారకరత్న అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తమ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా కూడా స్నేహితుల సమక్షంలో చేసుకున్నారు. తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు చిత్రానికి ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా పని చేసిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది.

తారకరత్న, అలేఖ్య రెడ్డి ఇద్దరు కులాలు వేరు అవ్వడంతో ఈమె పేరెంట్స్ కూడా వివాహానికి అంగీకరించలేదట. దీంతో పాటుగా గతంలో అలేఖ్యకు వివాహం జరిగినప్పటికీ తారకరత్నతో ఆమెకు రెండో వివాహం జరిగింది. దీంతో కుటుంబం నుంచి బయటికి వచ్చిన ఈ జంట ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. తారకరత్న, అలేఖ్యకు ముగ్గురు పిల్లలు ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఒకరు అబ్బాయి. తారకరత్న మరణం ఒక్కసారిగా అలేఖ్య జీవితాన్ని కుదిపేసిందని చెప్పవచ్చు.. ఆమె ప్రస్తుతం ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తోంది. కొడుకు మరణం తర్వాత  అయినా తారకరత్న తండ్రి మోహన్ కృష్ణ తన మనవళ్లను కోడలిని చెరతీస్తారు అనుకున్నప్పటికీ చేర తీయలేదట.

ఇటీవలే సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉన్న సమయంలో ఒక నెటిజన్..ఇప్పటికైనా తారకరత్న కుటుంబ సభ్యులు మిమ్మల్ని అంగీకరించారా అని అడగగా.. అందుకు అలేఖ్య రెడ్డి ఆశ , నమ్మకాలే  మనల్ని ముందుకు నడుపుతాయి.. ఆ నమ్మకంతోని ఇన్ని రోజులు ముందుకు సాగాను తన భర్త తారకరత్న కూడా ఎప్పుడు ఆశ నమ్మకాన్ని వదిలిపెట్టలేదని తాను కూడా వదిలిపెట్టనని కచ్చితంగా ఏదో ఒక రోజు అది జరుగుతుందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే అలేఖ్య ను కోడలిగా తారకరత్న కుటుంబం ఇంకా ఒప్పుకోలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: