ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్ ' రిలీజ్ ఎప్పుడంటే..?

murali krishna
తెలుగు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాదిలో హనుమాన్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. బాక్సాఫీస్ వద్ద రూ.320 కోట్లకి పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్‌’పైనే ఉంది..అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందుగానే ప్రకటించిన టీమ్ ఇప్పుడు షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు…ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పెండింగ్ లో ఉన్న సినిమా పై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ సినిమా కన్నా ముందు అనుపమ పరమేశ్వరన్ తో ఓ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. దాదాపుగా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరగా పూర్తి చెయ్యాలని డైరెక్టర్ భావిస్తున్నాడు.. ఆ సినిమాను ఈ ఏడాది లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నాడు..
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనుపమ సినిమా తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. రణ్‌వీర్ సింగ్‌తో ఒక చిత్రాన్ని ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2025లో సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్ నడుస్తుంది. దీన్ని బట్టి ప్రశాంత్ మొదటిగా ఈ హిందీ ప్రాజెక్ట్‌ను ముగించి ఆ తర్వాతే ‘జై హనుమాన్’ సినిమాను మొదలు పెడతారని సమాచారం.. అంటే 2026 కే జై హనుమాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చునని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి డైరెక్టర్ ఏం చెప్తారో చూడాలి..జై హనుమాన్ గురించి మీరు వినే రూమర్లు అన్నీ నిజమే. మీరు పెట్టుకునే అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుంది. అన్ని ఎమోషన్స్, ఎలివేషన్స్ ఉంటాయి. మీరు పెట్టే అన్ని కామెంట్లను చూస్తూనే ఉన్నాను. ట్రోలింగ్ చేస్తూ పెట్టే నెగెటివ్ కామెంట్లను కూడా చూస్తున్నాను." అంటూ ప్రశాంత్ వర్మ చెప్పారు.కాగా వీరి నిర్మాణంలో తెరకేక్కిన డార్లింగ్ మూవీ ఈ నెల 19న విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: