స్టార్ హీరో రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రెండు విభిన్న పాత్రలలో ప్రేక్షకులకు కనిపించనున్నారు. కాగా ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సినీ లవర్స్ ఏ కాకుండా సినీ వర్గాలలో కూడా ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. దానితో మేకర్స్ ఈ సినిమా షూటింగ్ పై ఎంతో జాగ్రత్త వహిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా సాగుతుండగా రామ్ ఫాస్ట్ లుక్ కు సంబంధిచిన
షూటింగ్ ని పూర్తిచేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చరణ్ నటిస్తున్న పాత్రపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అది ఏంటంటే... చరణ్ నటిస్తున్న విభిన్న పాత్రలలో ఆయన నటించిన మొదటి పాత్ర రామ్ నందన్ అని తెలుస్తుంది.అంతే కాకుండా ఇందులో రామ్ నందన్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఏదేమైనప్పటి ఇందులో రామ్ చరణ్ పేరు కలిసేలా రామ్ నందన్ అని పెట్టడం తో రామ్ అభిమానులు అంత చిత్ర యూనిట్ కి థాంక్స్ చెప్పుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి థమన్
అద్భుతమైన సంగీతాన్ని అందిస్తుండగా. అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తునారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్నా తర్వాత రామ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం తో ఈ మూవీ పై సినీ లవర్ అంత భారీ అంచనలను పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మూడేళ్ల క్రితం మొదలైంది. మధ్యలో అనేకసార్లు బ్రేకులు పడ్డాయి. దీంతో ఇంకా చిత్రీకరణ పూర్తవ్వలేదు. డైరెక్టర్ శంకర్.. భారతీయుడు 2 సినిమాపై ఫోకస్ చేయడంతో గేమ్ ఛేంజర్ లేట్ అయింది. ఇటీవల మళ్లీ స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. 2024లో ఎలా అయినా గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.