రాజ్ తరుణ్ కు అనేకమంది హీరోయిన్లతో సంబంధం ఉంది.. సంచలన విషయాలు బయటపెట్టిన లావణ్య..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో రాజ్ తరుణ్ ఒకరు. ఈయన ఉయ్యాల జంపాల మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన సినిమా చూపిస్త మామ , కుమారి 21 ఎఫ్ మూవీలతో మంచి విజయాలను అందుకొని మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తున్న కూడా ఈ సినిమా మంచి విజయం సాధించడం లేదు. ప్రస్తుతం కూడా ఈయన పలు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు.

ఇకపోతే తాజాగా రాజ్ తరుణ్ , లావణ్య టాపిక్ ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ప్రస్తుతం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం మాల్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడంటూ లావణ్య ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ కు చాలా మంది హీరోయిన్లతో రిలేషన్స్ ఉన్నాయి అంటూ కూడా ఈమె సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా లావణ్య మాట్లాడుతూ ... 14 సంవత్సరాలుగా నాకు రాజ్ తరుణ్ తెలుసు. దాదాపు 11 సంవత్సరాలుగా మేమిద్దరం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాం. మాల్వి వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. ఆ

మె నన్ను చంపేస్తాను అని బెదిరిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి చెన్నైలో ఓ హోటల్ లో ఉన్నారు. అన్ని ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తాను నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మస్తాన్ సాయికి , నాకు గొడవైంది. అందుకే అతనిపై ఫిర్యాదు చేశా. కొందరు నాతో మైండ్ గేమ్ ఆడారు. ఆ గేమ్ లో నేను , మస్తాన్ సాయి ఇద్దరం బాధితులమే. డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ తరుణ్ లేకుండా నేను బ్రతకలేను అని అన్నారు. ఇలా తాజాగా లావణ్య , రాజ్ తరుణ్ పై కామెంట్లు చేసింది. ప్రస్తుతం లావణ్య చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: