వెంకీ మామ నీకు అవసరమా.. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోయిన్లతో రొమాన్స్..!?

Anilkumar
సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అని రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు సైతం ఇటీవల నిర్వహించారు చిత్ర బృందం. ఇకపోతే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ తో పాటు ఇద్దరు స్టార్ హీరోయిన్లు కనిపించబోతున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. ఇక వెంకటేష్తో నటించే ఆ ఇద్దరు హీరోయిన్లు మరెవరో కాదు ఒకరు మీనాక్షి చౌదరి మరొకరు ఐశ్వర్య రాజేష్.  

మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. యంగ్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలను దక్కించుకుంటుంది మీనాక్షి చౌదరి. అయితే కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న గోట్ అనే సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ .ఇప్పటికే తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న మట్కా అనే సినిమాలో సైతం హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో రొమాన్స్ చేసే అవకాశాన్ని

 అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఐశ్వర్య రాజేష్  విషయానికి వస్తే తన న్యాచురల్ యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెప్పిస్తున్న అమ్మడికి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఐతే తెలుగులో మాత్రం తనని సరిగా గుర్తించట్లేదని చెప్పొచ్చు. ఐశ్వర్యా రాజేష్ ఇప్పటికే నాలుగైదు తెలుగు సినిమాల్లో నటించింది. ఐతే ఈ సినిమాల వల్ల ఆమెకు పెద్దగా పాపులారిటీ రాలేదు. వెంకటేష్  సినిమాతో అమ్మడు కచ్చితంగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. అనీల్ రావిపుడితో F2, f3 సినిమాలు చేసిన వెంకటేష్ మరోసారి హ్యాట్రిక్ మూవీని చేస్తున్నాడు. ఈ సినిమా కాస్త ఎమోషనల్ టచ్ ఇస్తూ ఎంటర్టైనింగ్ గా సాగుతుందట. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. వెంకటేష్ అనీల్ రావిపుడి సినిమా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ ని పరిశీలిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: