ఆ స్టార్ హీరో తో రాశి ఘాటు రొమాన్స్.. ఇప్పుడు బాధపడి ఏం లాభం..!?

Anilkumar
శుభాకాంక్షలు అనే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నటి రాశి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె శుభాకాంక్షలు అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసినప్పటికీ తనకి మంచి మార్కులు పడ్డాయి. దాని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన గోకులంలో అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.  అలా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ వంటి భాషల్లో సైతం నటించింది. దాదాపుగా 100 సినిమాల కంటే ఎక్కువే

 నటించింది.  ఈ నేపథ్యంలోనే కొత్త హీరోయిన్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి రావడంతో రాసి క్రేజ్ మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. అయినప్పటికి ఇప్పటివరకు తనను ఐటమ్ సాంగ్స్ విలన్ పాత్రల్లో తీసుకుంటూ ఉంటారు చాలామంది దర్శక నిర్మాతలు. అంతేకాకుండా ఇటీవల ఆమె బుల్లితెరకు సైతం ఎంట్రీ ఇచ్చింది. పలు సీరియల్స్ అలాగే పలు షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తోంది రాసి. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో డైరెక్టర్ తేజ  పై  కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తేజ – మహేష్ బాబు కలయికలో నిజం మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ లో గోపీచంద్ విలన్ గా నటించగా..రాశి కూడా విలన్ పాత్ర

 చేసింది. ఈ పాత్ర చేయడం వల్ల తన సినీ కెరియర్ నాశనం అయ్యిందని తాజాగా చెప్పుకొని బాధపడింది. ఈ మూవీలోని మల్లి క్యారెక్టర్ కారణంగా తాను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని.. ఇందులో గోపీచంద్‌తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్లలో నటించడం కొంప ముంచిందని రాశి పేర్కొంది. దర్శకుడు తేజ నిజం సినిమాలో తన పాత్ర గురించి చెప్పింది ఒకటి, చూపించింది మరొకటన్నారు. మొదటి నుంచి ఇష్టం లేకుండానే ఆ పాత్ర చేశానని.. షూటింగ్ మొదలైన మొదటిరోజే స్పాట్‌ నుంచి వెళ్లిపోదామని అనుకున్నానని కానీ అడ్వాన్స్ తీసుకోవడం వల్ల నటించాల్సి వచ్చిందని రాశి వెల్లడించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: