అంత గొప్ప పాత్రను మిస్ చేసుకున్న నయనతార.. అధికాని చేసుంటే వేరేలా ఉండేది..?

MADDIBOINA AJAY KUMAR
సినీ పరిశ్రమలో చాలా మంది నటీమణులు చాలా సినిమా అవకాశాలను వదులుకుంటూ ఉంటారు. అలా వదులుకోవడానికి ఆ సమయంలో ఆ కథ నచ్చకపోవడం లేక వేరే సినిమాలతో బిజీగా ఉండడమో లేక కొన్ని ఇతర కారణాల వల్ల కొన్ని సినిమాలను వదిలేస్తూ ఉంటారు. ఇక సినిమా విడుదల అయిన తర్వాత తాము వదులుకున్న సినిమా ఫ్లాప్ అయినా , అందులోని పాత్ర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా ఆ సినిమాను రిజెక్ట్ చేసి మంచి పని చేసాం అనుకుంటారు. కానీ సినిమా విడుదల అయిన తర్వాత ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయిన లేక ఆ సినిమాలోని ఆ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినా కూడా ఆ సినిమా చేసి ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు.

ఇకపోతే తెలుగు , తమిళ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన వారిలో ఒకరు అయినటువంటి నయన తార కూడా తన కెరీర్ లో ఒక అద్భుతమైన పాత్రను మిస్ చేసుకుంది. అది ఏమిటో తెలుసుకుందాం. అల్లు అర్జున్ , మంచు మనోజ్ , అనుష్క ప్రధాన పాత్రలలో కొన్ని సంవత్సరాల క్రితం వేదం అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పెద్ద స్థాయి విజయం సాధించకపోయినా ఈ మూవీ కి మాత్రం ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.

ఇక ఈ మూవీ లో అనుష్క వేశ్య పాత్రలో నటించింది. ఈ పాత్రకు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే మొదట అనుష్క ఈ మూవీ లో చేసిన వేశ్య పాత్ర కు క్రిష్ , నయనతారను సంప్రదించాడట. కాకపోతే ఈమె ఈ సినిమాలో ఈ పాత్ర చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదట. దానితో ఈయన అనుష్క ను సంప్రదించడం , ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా వేదం సినిమాలోని అనుష్క పాత్రను నయనతార మిస్ చేసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: