ఖైదీ నీ మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా... చేసుంటే లెక్క వేరేలా ఉండేది..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న సినిమాని మరొకరితో చేయడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. దర్శకులు కథ మొత్తం సిద్ధం అయ్యాక ఆ కథకు హీరోగా ఎవరు అయితే బాగుంటుంది అని దానిని బట్టి ఒకరికి ఆ కథను వివరిస్తారు. కానీ ఆ సమయంలో వారికి ఆ కథ నచ్చకపోవచ్చు లేక వేరే సినిమాలతో వారు బిజీగా ఉండొచ్చు మరే కారణాల వల్లనైనా కొంత మంది కొన్ని సినిమాలను వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్లయితే ఆ సినిమా ఓకే చెయ్యందే మంచిది అయింది అనుకుంటారు.

అదే సినిమా బ్లాక్ బాస్టర్ అయితే ఆ రోజు ఆ మూవీ ని ఓకే చేస్తే బాగుండేది అనుకుంటారు. ఇకపోతే తమిళ్ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో కార్తీ ఒకరు. ఈయన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు. ఈయన నటించిన మంచి విజయవంతమైన సినిమాలలో ఖైదీ మూవీ ఒకటి. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కథను మొదట లోకేష్ , కార్తీ కి కాకుండా జయం రవి కి వినిపించాడట.

కాకపోతే ఆయన ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో చేసేదేమీ లేక లోకేష్ , కార్తీ నీ సంప్రదించడం , ఈ సినిమా కథను చెప్పడం ఆయనకు ఈ మూవీ స్టోరీ ఎంతగానో నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా జయం రవి తో చేయాలి అనుకున్న ఖైదీ మూవీ ని లోకేష్ , కార్తీ తో చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఖైదీ 2 మూవీ ని కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు కార్తీ తాజాగా ఓ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: