జైలులో పెట్టిన తిండి అరగడంలేదు... ఇంటి ఫుడ్డు కావాలి: దర్శన్
ఈ నేపథ్యంలోనే దర్శన్ జైలు సూపరింటెండెంట్కు దిశానిర్దేశం చేస్తూ హైకోర్టుకి విన్నవించుకున్నాడు. ఆ విన్నపంలో తనకి ప్రైవేట్గా ఇంటి భోజనం, దుస్తులు, పరుపులు, పుస్తకాలను యాక్సెస్ చేయడానికి అనుమతించాలని కోరడం జరిగింది. కాగా కోర్టు ఉత్తర్వుతో పని లేనందున అతడికి ఇంటి ఆహారాన్ని అందించడానికి అయితే అనుమతించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కర్ణాటక జైళ్ల చట్టంలోని సెక్షన్ 30 (IGP (జైళ్లు) ద్వారా) అండర్ ట్రయల్ ఖైదీలు ఆరోగ్యం దృష్ట్యా సరైన ఆహారం, దుస్తులు వంటివి కొనుగోలు చేయడానికి లేదా ఇతరులనుండి స్వీకరించుకోవడానికి కోర్టు అనుమతిస్తుంది. ఈ సెక్షన్ నే దర్శన్ వాడుకోవాలని చూస్తున్నాడు.
ఇకపోతే ఈ కేసులోకి తనని అన్యాయంగా లాగారని, అందువల్ల సాధారణ బెయిల్ మంజూరుకు సంబంధించి తన న్యాయవాదుల నుండి న్యాయ సహాయం పొందే పనిలో ఉన్నట్టు ఆయన తాజాగా ఓ మీడియాకు చెప్పుకొచ్చారు. కాగా ఆయన పిటిషన్ బుధవారం కోర్టు ముందుకు రానుంది. కాగా ఈ కేసులో దర్శన్ ప్రియురాలు పవిత్ర ఏ1 గా కాగా, దర్శన్ ఏ2 గా ఉన్నారు. వీరితో పాటు మరో 16 మందిని అరెస్ట్ చేసి ప్రస్తుతం పోలీసులు వారినుండి మరింత సమాచారాన్ని రాబట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రియురాలు పవిత్రకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపడం వల్లనే దర్శన్ ఈ హత్య చేయించాడని పోలీసులు తమ కథనంలో పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే.