అలాంటి నిర్ణయం వల్లే పూరి తడబడుతున్నాడా.. డబల్ ఈస్మార్ట్ కి కూడా అదే పరిస్థితి..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత వేగంగా సూపర్ క్వాలిటీ ఉన్న సినిమాలు తీయగలిగిన దర్శకులలో పూరి జగన్నాథ్ మొదటి వరుసలో ఉంటారు. ఈయన కెరియర్ ప్రారంభంలో అనేక విజయాలను అందుకున్నారు. ఇకపోతే ఈయన విజయం అందుకున్న ఏ సినిమా షూటింగ్ ను కూడా ఎక్కువ రోజులు చేయకుండా చాలా స్పీడ్ గా సినిమాలను పూర్తి చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ ఉండేవాడు. దానితో స్టార్ హీరోలు అంతా పూరితో సినిమా చేయడానికి ఎంతో ఇష్టపడేవారు. ఎందుకు అంటే వేరే దర్శకులతో అయితే చాలా టైమ్ పడుతుంది.

అదే పూరి అయితే చాలా స్పీడ్ గా మూవీ ని పూర్తి చేస్తాడు అనే ఉద్దేశంతో పూరి తో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు ఇష్టపడుతూ ఉండేవారు. కానీ గత కొద్ది కాలంగా పూరి కూడా తన ట్రాక్ ను మార్చాడు. ఈస్మార్ట్ శంకర్ మూవీ విజయం తర్వాత పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా లైగర్ అనే మూవీని స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా సంవత్సరాలే సాగింది. మధ్యలో కరోనా రావడం , మరికొన్ని ఇతర కారణాలతో ఈస్మార్ట్ శంకర్ తర్వాత లైగర్ విడుదలకు పూరీ జగన్నాథ్ చాలా సమయం తీసుకున్నాడు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

ఆ తర్వాత డబల్ ఈస్మార్ట్ మూవీ ని పూరి జగన్నాథ్ స్టార్ట్ చేశాడు. రామ్ పోతినేని ఈ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. కావ్య దాపర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ను కూడా పూరి చాలా రోజుల నుండి చేస్తూ వస్తున్నాడు. ఒకప్పుడు చాలా స్పీడ్ గా సినిమాను పూర్తి చేస్తాడు అని పేరున్న పూరి జగన్నాథ్ కూడా ఈ మధ్యకాలంలో సినిమా సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. మరి కొంత మంది ఆయన గ్యాప్ తీసుకోవడం వల్లే ప్లాప్స్ ఇస్తున్నాడు. ఆయన స్ట్రెంత్ స్పీడ్ గా మూవీస్ కంప్లీట్ చేయడమే. అలాగే మళ్ళీ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చాలా మంది ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: