రాజ్ తరుణ్ కేసులో సరికొత్త వ్యవహారాలు బయటపడుతున్నాయి. తనని ప్రేమించి మోసం చేశాడు అని ఆరోపిస్తోంది లావణ్య. రాజ్ తరుణ్ మాల్వీతో ప్రేమయాణం నడిపిస్తున్నాడని, అందుకే తనని దూరం పెడుతున్నాడంటూ అతడి ప్రియురాలు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వీరిద్దరు కలిసి గోవా, చెన్నై, పాండిచ్చేరి ఇలా వెకేషన్స్కి వెళ్లారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక రాజ్ తరుణ్ కూడా స్పందిస్తూ లావణ్యతో రిలేషన్లో ఉన్నట్టు ఒప్పుకున్నాడు. కానీ, అది ఒకప్పుడని, ఇప్పుడు తనకి ఆమె సంబంధం లేదన్నాడు. లావణ్య తనతో ఉంటూనే మస్తాన్ సాయి అనే వ్యక్తితో
ఎఫైర్ పెట్టుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు తనకు ఉన్న డ్రగ్స్ అలవాటు వల్లే ఆమెను నుంచి దూరంగా ఉన్నానని చెప్పాడు. మరోవైపు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కూడా లావణ్యపై ఫిర్యాదు చేయడంతో కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఆమె మాట్లాడుతూ.. రాజ్ తరుణ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు కేవలం నా సహానటుడు మాత్రమే. నిజానికి నాకు లావణ్య ఎవరో కూడా తెలియదు. ఆమెను నేరుగా నేనేప్పుడు చూడలేదు. ఆమెతో నాకు అసలు పరిచయం లేదు. నా సోదరుడు, నేను ఆమెకు ఫోన్ చేసి బెదరిస్తున్నట్టు చెప్పింది. తాజాగా లావణ్య హీరో రాజ్ తరుణ్కు తనకు పదేళ్ల కిందటే
వివాహమైందని లావణ్య చెప్పారు. తాము అప్పటి నుంచి కాపురం చేస్తున్నామని వెల్లడించారు. కొన్నాళ్ల క్రితమే రాజ్తరుణ్ తనకు అబార్షన్ చేయించారని కూడా పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. మెడికల్ డాక్యుమెంట్లను కూడా పోలీసులకు అందించారు. ఈ నేపథ్యం లోనే లావణ్య ఎందుకు ఇలా చేస్తుంది.. ఏం సాధించడానికి చేస్తుంది అన్న కోణం లో ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు లావణ్య ఒక శాడిస్ట్ అని.. రాజ్ తరుణ్ వేరే అమ్మాయిలతో మాట్లాడకూడదు అని.. కేవలం తనతోనే ఉండాలి అని ఇంతకీ తెగించినట్టు తెలుస్తుంది. మరీ ఈ విషయం లో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది..!!