కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు నిఖిల్. ఈ ఒక్క సినిమాతో ఫ్యాన్ ఇండియా హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. 'కార్తికేయ 2' సినిమా తరువాత నిఖిల్ 'స్పై అని ఓ సినిమా చేశారు. అది కూడా పాన్ ఇండియా మూవీ నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభు’ సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో నిర్మాణంలో భువన్, శంకర్ నిర్మాతలుగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ స్వయంభు సినిమా తెరకెక్కుతుంది. సంయుక్త, నభా నటేష్ లు హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్
సినిమాగా తెరకెక్కుతున్న స్వయంభులో నిఖిల్ ఓ లెజెండరీ యోధుడిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నభా నటేష్ తాజాగా ఏ సినిమాకి సంబంధించిన పలు కీలకమైన అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే.. నిఖిల్- నభా నటేష్ నటిస్తున్న ఈ సినిమాను రెండు లేదా మూడు భాగాలుగా తీసుకురావొచ్చట. ఈ సినిమా రెండు, మూడు భాగాలుగా తీయొచ్చనే హింట్ చిత్ర దర్శకుడు ఇప్పటికే ఇచ్చారు అని నభా నటేశ్ అంటోంది. సినిమా కథ చెప్పినపుడే దర్శకుడు ఈ మాట అన్నారట. మూడు, నాలుగు
భాగాలకు సరిపడా కథ తన దగ్గర ఉందని, రెండు భాగాలు అయితే తీయక తప్పదు అని చెప్పారట. దీంతో పాన్ ఇండియా సినిమా అనుకున్నారు కానీ.. ఏకంగా సినిమాటిక్ యూనివర్స్నే సిద్ధం చేస్తున్నారు అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి కార్తికేయ టు తో ఫ్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నిఖిల్ ఈ సినిమాతో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాల్సి ఉంది.