నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. పోర్ట్ బ్యాక్ డ్రాప్లో మత్స్యకారుల జీవితాలను, అందులో ఓ జాలరీ ప్రేమకథని ఆవిష్కరించే కథాంశంతో ఈ మూవీని రూపొందిస్తున్నారు యువ దర్శకుడు చందూమొండేటి. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో టాలెంటెడ్ నటి సాయిపల్లవి హీరోయిన్ కావడం విశేషం. లవ్ స్టోరీ సినిమా తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో సినిమాకి మంచి క్రేజ్ నెలకొంది.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ దసరా పండుగకి ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని టీమ్ భావిస్తుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ టీజర్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అవి ఇంట్రెస్ట్ ని, ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా తర్వాత నాగచైతన్య మరో సినిమా చేయబోతున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ మూవీ ఫైనల్ అయ్యింది. చైతూ మూవీగా ఇది తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.నాగచైతన్య తన కెరీర్లోనే ఫస్ట్ టైం ఓ ప్రయోగం చేస్తున్నారట. ఈ మూవీలో ఆయన డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఆ రెండు పాత్రల్లో ఒకటి డిఫరెంట్గా ఉంటుందని, దానికి సంబంధించిన మేకోవర్ కూడా కొత్తగా ఉంటుందట.
ఇప్పటి దాకా చూడని నాగచైతన్యని ఈ సినిమాలో చూడొచ్చని తెలుస్తుంది. తండేల్`కి సంబంధించిన షూటింగ్ వర్క్ కంప్లీట్ అయ్యాక.. చైతూ ఆ సినిమా మేకోవర్పై వర్క్ చేస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. అయితే `మనం మూవీలో చైతూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. కానీ అది పూర్తిగా డ్యూయెల్ రోల్ కాదు. కానీ ఈ మూవీలో మాత్రం పూర్తి ద్విపాత్రాభినయం అని రెండు పాత్రలు భిన్నంగా ఉంటాయని మేకర్స్ అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీలో ఆయన పూజా హెగ్డేతో రొమాన్స్ చేయబోతున్నారట. గతంలో వీరి ఇద్దరి కాంబినేషన్లో ఒక లైలా కోసం సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా యావరేజ్గా ఆడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరు ఇద్దరు కూడా కలిసి నటించబోతుండటం విశేషం. ఇందులో చైతూ, పూజాల మధ్య లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఇందులో యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్లు కూడా ఉంటాయని సమాచారం తెలుస్తుంది.