రామ్ చరణ్ కోసం అలాంటి కథను తయారుచేశా... కృష్ణవంశీ..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో కృష్ణ వంశీ ఒకరు. ఈయన తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగులో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇకపోతే కృష్ణ వంశీ ఆఖరుగా రంగ మార్తాండ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే కృష్ణ వంశీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్నాడు. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ కూడా ఉంటాడు. అందులో భాగంగా తాజాగా కృష్ణ వంశీ తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించాడు.

అందులో భాగంగా ఓ అభిమాని కృష్ణ వంశీ గారిని మీరు రామ్ చరణ్ కు ఒక అద్భుతమైన విజయాన్ని అందిస్తాను అని అన్నారు మరిచిపోయారా ..? మీరు ఎప్పుడు చరణ్ తో సినిమా చేస్తారు అని ప్రశ్నించాడు. దీనికి కృష్ణ వంశీ స్పందిస్తూ ... అస్సలు మరిచిపోలేదు. చరణ్ తో సినిమా చేయడానికి నేను ఎప్పుడూ రెడీ. ఆయనతో సినిమా చేయడం కోసం ఒక అద్భుతమైన పాయింట్ నూ కూడా ఇప్పటికే రెడీ చేసి పెట్టుకున్నాను. చరణ్ నాతో సినిమాకు ఓకే అంటే మూవీ సెట్ అయిపోతుంది. అంతా చరణ్ చేతుల్లోనే ఉంది అని ఆయన తాజాగా తెలియజేశారు.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం రామ్ చరణ్ హీరో గా కృష్ణ వంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్ , శ్రీకాంత్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ ని పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: