టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అనారోగ్యం కారణంగా గత కొంతకాలం నుంచి నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న సామ్ భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది. అయితే మళ్లీ తాను సినిమాలకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఎంతో కాలంగా మీడియాకి దూరంగా ఉన్న సమంతా చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ రిలీజ్కు
రెడీ అవుతున్న నేపథ్యంలో మళ్లీ మీడియాతో టచ్లోకి వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ గత మూడేళ్లుగా తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.కొంత కాలం చాలా కష్టాలు పడ్డా అన్న సమంత, ఆ ఇబ్బందులే తనను మరింత బలంగా తయారు చేశాయన్నారు. అలాంటి రోజులు మళ్లీ తన జీవితంలో రాకూడదని కోరుకుంటున్నా అన్నారు. అనారోగ్య కారణాలతో షూటింగ్స్కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ, ఇటీవల మా ఇంటి బంగారం పేరుతో ఓ ను ఎనౌన్స్ చేశారు. ఖుషి తో పాటు సిటాడెల్ ఇండియన్ వర్షన్ షూటింగ్ పూర్తి చేశారు సమంత. భారీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ వెబ్
సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. త్వరలో డిజిటల్ ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో లీడ్ రోల్లో నటించిన సమంత ప్రమోషన్స్కు రెడీ అవుతున్నారు. ఇక సామ్ సినిమాల విషయానికి వస్తే.. సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో నటిస్తుంది. ఈ చిత్రం అనంతరం మలయాళంలో మెగాస్టార్ మమ్ముట్టితో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు గౌతమ్ వాస్దేవ్ మీనన్ దర్శకత్వం వహించబోతున్నాడు. మరోవైపు ఈ సినిమాతో పాటు ‘మా ఇంటి బంగారం’ సినిమాను అనౌన్స్ చేసింది. తన సొంత ప్రొడక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది...!!