ఈ 2024లో విడిపోయిన సెలబ్రిటీ జంటల సంగతి తెలిస్తే అవాక్కవాల్సిందే!
అలాంటి సందర్భాలు మనదగ్గర ఎన్నో కనబడతాయి. 2021లో నాగచైతన్య - సమంత విడిపోయినప్పుడు ఓ వర్గం ఫాన్స్ అయితే గగ్గోలు పెట్టారు. ఈ క్రమంలో హీరోయిన్ సమంత పైన ఏ విధంగా కామెంట్స్ చేసారో అందరికీ తెలిసినదే. అంతలా మనవాళ్ళు వారికి కనెక్ట్ అయిపోతారు. అయితే వెండితెరపైన చక్కటి ప్రేమ కావ్యాలను, వివాహ బంధాలను ఆవిష్కరించిన సదరు హీరోలు మాత్రం రియల్ లైఫ్ లో మాత్రం అవి పాటించారనే భయంకర సత్యం ఈ జనాలకి తెలియదు.. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఈ 2024లోను వినోద పరిశ్రమ సెలబ్రిటీ కపుల్స్ గురించి జనాలు వినకూడని విషయాలు కొన్ని వినాల్సి వచ్చింది. అవును, కొన్ని బ్రేకప్ లు జనాల హృదయాల్ని కదిలించాయి. అయితే ఈసారి ఎక్కువగా బాలీవుడ్ జంటలే విడిపోవడం కొసమెరుపు.
అందులో మొదటి జంట ఈషా డియోల్ - భారత్ తఖ్తానీ జంట. బాలీవుడ్ నటి ఈషా డియోల్ గురించి అందరికీ తెలిసిందే. డ్రీమ్ గర్ల్ హేమమాలిని- ధర్మేంద్రల కుమార్తె అయినటువంటి ఆమె వ్యాపారవేత్త భరత్ తఖ్తానీ నుంచి విడిపోవడం చాలా మందికి షాక్ ఇచ్చింది. తరువాతి జంట ఇషా కొప్పికర్ - టిమ్మీ నారంగ్. ఇక ఇషా కొప్పికర్ గురించి తెలుగు జనాలకు తెలిసిందే. నాగార్జున చంద్రలేఖ చిత్రంలో రమ్యకృష్ణతో పాటు కలిసి నటించింది. ఈ లిస్టులో మూడవ జంట దల్జీత్ కౌర్ - నిఖిల్ పటేల్.. బేసిగా టెలివిజన్ నటి అయినటువంటి దల్జీత్ కౌర్.. ఆమె భర్త నిఖిల్ పటేల్ నుండి తాజాగా విడిపోయింది. ఆ తరువాత కపుల్స్.. అర్జున్ కపూర్ - మలైకా అరోరా.. వీరి గురించి చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట తాజాగా విడిపోయారు. మలైకా గురించి అందరికీ తెలిసిందే.. ఈమె పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని ఐటెం సాంగ్ లో నటించి మెప్పించింది. ఈ లిస్టులో ఆఖరి జంట హార్దిక్ పాండ్యా- నటాసా స్టాంకోవిచ్.. వీరి గురించి జనాలకు బాగా తెలుసు.. క్రికెటర్ హార్దిక్ పాండ్యా- నటి కం మోడల్ నటాసా స్టాంకోవిచ్ కూడా 2024లో తమ అనుబంధాన్ని ముగించారు.