ఆర్తి అగర్వాల్ ను వారు దారుణంగా వాడుకున్నారు... స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు?
ఆ సినిమాలన్నీ ఒకెత్తయితే ఆమె యువ హీరో తరుణ్ తో చేసిన సినిమాలు వేరు అని చెప్పుకోవచ్చు. వారి కాబోలో వచ్చిన.. 'నువ్వులేక నేను లేను' సినిమా భాక్షాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో వీరు ప్రేమలో పడిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే వీరి కెరీర్ సజావుగా సాగుతుంది అనుకొనే లోపే ఆమె చేసిన కొన్ని సినిమాలు ప్లాఫ్ కావడం కారణంగా ఆర్తి కెరీర్ సన్నగిల్లింది. అదే క్రమంలో హీరో తరుణ్ కూడా హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత కాలంలో వీరిద్దరి రిలేషన్ కాస్త బీటలు వారింది. తరువాతి కాలంలో ఆర్తి శారీరకంగా బాగా లావు కావడం కూడా ఆమె సినిమా కెరీర్ పైన ఎఫెక్ట్ చూపింది. దాదాపు ఆమెకి తరువాత సినిమాలు లేకుండా పోయాయి.
ఈ నేపథ్యంలో లావు తగ్గాలన్న ఆరాటంతో ఆమె లైపో సెక్షన్ ట్రిట్మెంట్ చేసుకొని అది కాస్త వికటించి.. కొంత కాలానికి ఆమె మరణించింది. అలా ముచ్చటగా మూడు పదులు వయస్సు నిండకుండానే.. ఆర్తి అగర్వాల్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమని శోక సంద్రంలోకి నెట్టింది. అయితే ఆమె మరణించిన చాన్నాళ్ల తరువాత ప్రముఖ స్టార్ కొరియో గ్రఫర్, డైరెక్టర్ కమ్ యాక్టర్ అమ్మా రాజశేఖర్ తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ.. ఆమె గురించి కొన్ని ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసాడు. రణం2 సినిమాలో ఆర్తి అగర్వాల్ అమ్మా రాజశేఖర్ కు జంటగా నటించిన సంగతి విదితమే. కాగా ఈ సినిమా షూటింగులో ఖాళీ సమయాల్లో ఆమె జీవితం నాశనం అవ్వడానికి గల కారణాలను రాజశేఖర్ కి చెప్పుకొచ్చిందట. ఇండస్ట్రీలో పెద్ద వారు అనబడేవారే తనని మోసం చేసినట్టు చెప్పుకుంటూ వాపోయింది రాజశేఖర్ ఓ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. అయితే వారి పేర్లు మాత్రం ఆయన వెల్లడించకపోవడం గమనార్హం