ఆగష్టు 15 విజేత పై కొనసాగుతున్న కన్ఫ్యూజన్ !
ఈ ప్రయత్నాలలో భాగంగా ఇప్పుడు విడుదల కాబోతున్న సినిమాల సంఖ్య సుమారు 4 చేరుకోవడంతో ఇన్ని సినిమాలను ప్రేక్షకులు చూస్తారా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. ఈ పోటీలో ప్రధానంగా నిలుస్తోంది రామ్ పూరీ జగన్నాథ్ ల కలయికలో వస్తున్న ‘డబల్ ఇస్మార్ట్’ ఈమూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. లేటెస్ట్ గా విడుదలైన ఈసినిమాకు సంబంధించిన రెండు పాటలు జనానికి బాగా నచ్చడంతో ఈమూవీ పై మరింత అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాకు పోటీగా వస్తున్న మిగతా సినిమాల లిస్టులో అగ్ర స్థానంలో ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నవీన్ నార్నె నటించిన ‘ఆయ్’ కూడ ఉంది. ఈ సినిమాలో వచ్చే వర్షం యాక్షన్ సీన్స్ కోసం నిర్మాత అల్లు అరవింద్ కోటి రూపాయలు ఖర్చు పెట్టారు అని వస్తున్న వార్తలు మరింత షాకింగ్ గా మారాయి.
ఈ రెండు మాత్రమే కాకుండా నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన ’35 చిన్న కథ’ మూవీ కూడ ఒక డిఫరెంట్ సినిమా అన్న ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ పబ్లిసిటీని చాల డిఫరెంట్ గా చేస్తున్నారు. ఈసినిమాలతో పాటుగా విక్రమ్ ‘తంగలాన్’ కూడ విడుదల అవుతూ ఉండటంతో ఇన్ని సినిమాలలో ఏసినిమా స్వాతంత్ర దినోత్సవ విజేతగా మారుతుంది అన్న ఆశక్తి అందరి లోనూ ఉంది..