గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అనంతరమే చరణ్ ఈ సినిమాకు సైన్ చేశాడు. షూటింగ్ కూడా మొదలై రెండేళ్లు అవుతుంది. కానీ మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. స్లో స్లోగా ముందుకు వెళుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిలో దశలో ఉంది ఇంకా కొన్ని రోజుల షూటింగ్ మాత్రమే ఉందని డైరెక్టర్ శంకర్ వెల్లడించారు.అయితే గేమ్ ఛేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ అంతా నిరాశలో ఉన్నారు. ఇప్పటి వరకు మూవీకి సంబంధించిన ఎలాంటీ క్రేజీ అప్డేట్ రాలేదు. కనీసం రిలీజ్ డేట్పై క్లారిటీ లేదు. దీంతో ఈ సినిమా సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇవ్వండి అంటూ తరచూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డైరెక్టర్ శంకర్ని రిక్వెస్ట్ చేస్తుంటారు. కానీ మూవీ టీం నుంచి దీనిపూ ఎలాంంటి రెస్పాన్స్ రావడం లేదు. దీంతో గేమ్ ఛేంజర్ విషయంలో కాస్తా మూవీ టీంపై గుర్రుగా ఉన్నారు అభిమానులు. ఈ క్రమంలో వారందరికి సర్ప్రైజ్ ఇస్తూ నిర్మాత దిల్ రాజు క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెబుతూ ఫ్యాన్స్ని కూల్ చేశాడు.తమిళ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన రాయన్ చిత్రం జూలై 26న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూలై 21హైదరాబాద్లో జరిగింది.ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు.రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ క్రిస్మస్ కి కలుద్దాం అంటూ చెప్పుకొచ్చారు. డిసెంబర్ నెలలో సినిమా రిలీజ్ కానుంది అన్నట్లుగా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇప్పుడు కన్ఫర్మ్ చేయడం తో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు 2 రిలీజ్ కావడంతో ఇక మొత్తం ఫోకస్ గేమ్ చేంజర్ పైనే ఉంది. ఈ చిత్రంలో అంజలి, ఎస్.జే. సూర్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.దీంతో ఈ చిత్రం డిసెంబర్ 19 లేకపోతే డిసెంబర్ 20న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. క్రిస్మస్ వీక్లో వస్తే న్యూఇయర్ కూడా కలిసి కలిసివస్తుంది. దీంతో క్రిస్మస్ వీక్లోనే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.