క్రేజీ న్యూస్.. ఒకే స్క్రీన్ పై సూర్య, కార్తీ?
అయితే ఇలా మల్టి స్టారర్ సినిమాలు వస్తేనే ఈ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఏకంగా ఒకే కుటుంబం నుంచి స్టార్ హీరోలుగా ఎదిగిన వారు సినిమాలు చేస్తే.. ఇక ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఒక క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది అనేది తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కేవలం తమిళంలోనే కాదు అటు తెలుగులో కూడా స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు సూర్య. తన సినిమాలు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి.
అయితే సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తి.. ఇక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్లను దక్కించుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి అదరగొడుతూ ఉంటాడు. కాగా ప్రస్తుతం సూర్య కంగువ అనే సినిమాలో నటిస్తూ ఉండగా.. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ స్టార్ అన్నదమ్ముల గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారిపోయింది. కంగువ సినిమాలో సూర్య తమ్ముడు కార్తీ ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని.. ఇక వీరిద్దరి కలయికలో ఉండే సీన్స్ సీక్వల్ కు దారి తీస్తాయని ఒక టాబ్ చక్కర్లు కొడుతుంది. దీంతో అన్నదమ్ములు ఇద్దరిని కూడా ఒకే స్క్రీన్ పై చూడ్డానికి అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.