కల్కి పార్ట్ 2 విషయంలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.. అస్సలు ఊహించలేదయ్యా..!!
అయితే కల్కి సినిమాకి పార్ట్ 2 ఉందని సినిమా చివర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్ట్ 2 కోసం ఇప్పట్నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు. ఆల్రెడీ కొంచెం షూటింగ్ కూడా అయిపోయిందని, 2025లో రిలీజ్ చేస్తామని కూడా తెలిపారు నిర్మాత. అయితే కల్కి సినిమాని రెండు పార్టులుగా తీయాలని ఎలా డిసైడ్ అయ్యారో తెలుసా.తాజాగా నాగ్ అశ్విన్ 2 అనే నెంబర్ రాసి ఉన్న ఒక పేపర్ ని ఫోటో తీసి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి.. కల్కిని రెండు పార్టులుగా తీయాలని ఈ మెథడ్ తో డిసైడ్ అయ్యాం అంటూ తెలిపాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అంత పెద్ద కల్కి సినిమాని రెండు పార్టులుగా తీయాల వద్దా అని చిట్టీలు వేసుకొని చిట్టిల్లో 2 వస్తే పార్ట్ 2 తీయాలని ఫిక్స్ అయ్యారని నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్ గా చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కొందరు సరదాగా చెప్తున్నారేమో అని, నాగ్ అశ్విన్ పై సరదాగా చిట్టీలు వేసి కల్కి పార్ట్ 2 తీద్దామని డిసైడ్ అయ్యారా అని కామెంట్స్ చేస్తున్నారు.దీంతో అప్పుడే పార్ట్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి పార్ట్-2 పై స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ మేరకు కల్కి కథ మొత్తం పార్ట్-2 లోనే ఉంటుందని ఒక్కసారిగా హైప్ పెంచేసాడు. సీక్వెల్కు సంబంధించి నెలరోజుల షూటింగ్ చేశాం. దానిలో 20 శాతం బెస్ట్గా వచ్చింది. ఇంకా ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది అని అన్నాడు.