డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ,ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్ ” సినిమాకు ఈ సినిమా కొనసాగింపుగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పూరిజగన్నాథ్ ,ఛార్మి కౌర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.లైగర్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్న పూరీజగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు.అలాగే హీరో రామ్ కు కూడా డబుల్ ఇస్మార్ట్ హిట్ ఎంతో అవసరం.తానూ రీసెంట్ గా నటించిన సినిమాలు అన్ని కూడా ఫ్లాప్స్ గా నిలవడంతో హీరో రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు .ఇదిలా ఉంటే ఈ సినిమా ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ ను మేకర్స్ రీసెంట్ గా ప్రారంభించారు.తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి అదిరిపో యే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ ను ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్ర యూనిట్ మే 15వ తేదీన రిలీజ్ చేయనుంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ క్రమంలో పాన్ ఇండియా బ్లాక్బస్టర్ ‘హను-మాన్’ని అందించిన డిస్ట్రిబ్యూషన్ హౌస్ చాలా గ్రాండ్గా ఐదు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే.. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూవీ విడుదల దగ్గర పడుతుండడంతో తాజాగా 50 రోజుల కౌంట్డౌన్ను మార్కింగ్ చేస్తూ మేకర్స్ రామ్ పోతినేని స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. రామ్ కు జోడీగా కావ్య థాపర్ నటిస్తోండగా పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ కలిసి చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల కానుంది.అయితే ఓవర్సీస్ లో ఆగస్టు 14న ప్రీమియర్ షోలు ఉంటాయని ప్రకటిస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడి న్యూస్ నెట్టింట హాట్ టాప్పిగా మారింది.అయితే ఇదే రోజు రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది.