ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను చేపట్టి ప్రస్తుతం రాజకీయం పరంగా ఫుల్ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్లలో పెద్ద పండగే. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్.. కొన్నాళ్లపాటు తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పవన్ చేతిలో ఇప్పుడు మూడు చిత్రాలు ఉండగా..ఆ సినిమాలు రిలీజ్ కావడానికి మరికొంత సమయం పట్టనుంది. అయితే ఇటు సినిమాల్లో
పవన్కళ్యాన్ హీరోగా మొదలుపెట్టి షూటింగ్లు మధ్యలో ఆగిపోయిన సినిమాలు ఆయన పూర్తిచేయాల్సి వుంది. ఈ చిత్ర నిర్మాతలు ఆలెడ్రీ పవన్ సంప్రదించడం మొదలుపెట్టారు. ఇందులో హరి హర వీర మల్లు చిత్రం ఒకటి. ఈ చిత్రం షూటింగ్ ఎనభై శాతం పూర్తిచేసుకుంది. బ్యాలెన్స్ వర్క్ పార్ట్ కోసం నిర్మాత ఎ.ఎం. రత్నం పనన్ డేట్స్ను కోరుతున్నాడు. కేవలం ఒక పది రోజులు డేట్స్కేటాయిస్తే పవన్కల్యాణ్ పార్ట్ షూటింగ్ పూర్తి అవుతుంది. దీంతో పాటు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీని చిత్రం షూటింగ్ను కూడా పవన్కళ్యాన్ పూర్తి
చేయాల్సింది. ఈ సంవత్సరమే పవన్ అభిమానులకు ఆ సినిమాను చూపించాలనే ఉత్సాహాంతో వున్నారు సుజిత్. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్మాతక్మంగా రూపొందనున్న ఉస్తాద్ గబ్బర్సింగ్ ఓ రెండు షెడ్యూల్స్ను మాత్రమే పూర్తిచేసుకుంది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ బిజీని అర్థం చేసుకుని ఈ లోపుగా రవితేజతో మిస్టర్ బచ్చన్ కూడా పూర్తిచేశాడు.. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసి రాజకీయం పరంగా ఏపీ సమస్యలను పరిష్కరించే పనులతో బిజీగా ఉన్నాడు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల వైపు మళ్లీ ఎప్పుడు అడుగులు వేస్తారు ఎప్పుడు తమకి డేట్స్ ఇస్తాడు అని ఎదురుచూస్తున్నారు దర్శక నిర్మాతలు..!!