ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో భారీ గుర్తింపుని సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. అయితే హీరోయిన్ అంజలి ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా ఆమె ‘బహిష్కరణ’ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. పైగా ఈ సిరీస్ లో అంజలి బోల్డ్ సీన్స్ లో కూడా నటించింది. ఈ క్రమంలో అంజలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి ఆసక్తికర
కామెంట్స్ చేశారు. బహిష్కరణ వెబ్ సిరీస్లో అలాంటి సన్నివేశాల్లో నటించే సమయంలో సెట్లో అందరినీ బయటకు పంపి చిత్రీకరించినట్లు అంజలి చెప్పుకొచ్చింది. అయితే అలా చేసినా తాను కొంచెం గందరగోళానికి గురయ్యానని తెలిపింది. ఇక కెరీర్ తొలి నాళ్ల నుంచి తనకు మంచి పాత్రలు వచ్చాయన్న అంజలి.. తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్ట్లనే ఎంచుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక కొన్ని సినిమాల కోసం మార్షల్ ఆర్ట్స్ సైతం నేర్చుకున్నానని, యాక్షన్ సన్నివేశాలు కూడా డూప్ లేకుండా చేస్తానని చెప్పుకొచ్చింది.
ఇక 'నవరస' సిరీస్ చేసినప్పుడు ఎదురైన ఓ అనుభవాన్ని అంజలి పంచుకుంది. 'కాస్ట్యూమ్ కారణంగా కొన్ని గంటలపాటు వాష్రూమ్కు కూడా వెళ్లలేద'ని చెప్పుకొచ్చింది. అలాగే, అంజలి ఇంకా మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ గురించి నేను పట్టించుకోను. ఇప్పటికే, నా గురించి చాలా రూమర్స్ రాశారు. ఎవరైనా తప్పుగా రాసినప్పుడు చదివి బాధపడతాను. కానీ వెంటనే మర్చిపోతాను. ముఖ్యంగా నా పెళ్లిపై కూడా ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ, అవన్నీ పూర్తి అవాస్తవం’ అంటూ ఆమె చెప్పింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గురించి కూడా ఆమె చెప్పుకొచ్చారు. మంచి సినిమా ఇది. నా పాత్రకు నేను ఎంతవరకు న్యాయం చేయగలను అనేది నా చేతిలో ఉంటుంది. సినిమా ఫలితం విషయంలో నేనేం చేయలేను. నా పాత్రకు అనుకున్నదానికంటే మంచి స్పందన వచ్చింది. ఇక సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ గురించి పట్టించుకోను. నా గురించి ఎవరైనా తప్పుగా రాసినప్పుడు చదివి బాధపడతాను. కానీ వెంటనే మర్చిపోతాను. అంటూ ఆమె చెప్పింది. ..!!