దర్శకుడు లోకేష్ కనగరాజ్ బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. సౌత్ స్క్రీన్ మీద తొలిసారి యూనివర్స్లకు తెర లేపిన ఈ దర్శకుడు, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను అవెంజర్స్ రేంజ్లో చూపించబోతున్నారు. ఇంతకీ లోకేష్ ప్లాన్ చేస్తున్న ఆ సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరి. ప్రజెంట్ రజనీకాంత్ హీరోగా కూలీ సినిమాను తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్, నెక్ట్స్ బ్లాక్ బస్టర్ ఖైదీ పార్ట్ 2 ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు.ఈ సినిమాను నెవ్వర్ బిఫోర్ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు లోకేష్. బిగ్గెస్ట్ ఎవ్వర్ మల్టీ స్టారర్ను ఆడియన్స్కు చూపించేందుకు రెడీ అవుతున్నారు.లోకేష్ యూనివర్స్లో తొలి సినిమాగా వచ్చింది ఖైదీ. ఆ తరువాత ఆ సినిమా కథకు కొనసాగింపుగా విక్రమ్, మాస్టర్ సినిమాలు వచ్చాయి. అందుకే త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోయే ఖైదీ పార్ట్ 2లో ఆ రెండు సినిమాల్లో కనిపించిన మెయిన్ క్యారెక్టర్స్ను చూపించే ప్లాన్లో ఉన్నారు.ఇక ఈ యూనివర్స్ నుంచి ముందుగా రాబోతున్న సినిమా ‘ఖైదీ 2’. కార్తీ హీరోగా తెరకెక్కిన ఖైదీ 1నే LCU యూనివర్స్ కి బీజం అయ్యింది. ఇప్పుడు ఆ బీజంతోనే ఇతర పాత్రల కథలను కూడా ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారట.
ఈక్రమంలోనే ఖైదీ 2లో సూర్య ‘రోలెక్స్’ పాత్రని, కమల్ హాసన్ ‘విక్రమ్’ పాత్రని చూపించబోతున్నారు. అయితే ఈ సీక్వెల్ లో కార్తీ ‘ఢిల్లీ’ పాత్ర బ్యాక్ స్టోరీతో పాటు రోలెక్స్ బ్యాక్ స్టోరీని కూడా చూపించబోతున్నారు. అంతేకాదు ఈ సీక్వెల్ లోనే రోలెక్స్ తో ఢిల్లీ, విక్రమ్ వార్ మొదలు కాబోతుందని లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చారు.ఇక ఈ విషయం తెలియడంతో LCU మూవీ లవర్స్ కి ఖైదీ 2పై మరింత క్యూరియాసిటీ పుట్టుకొచ్చింది.కార్తీ కూడా ప్రస్తుతం సర్దార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ షూటింగ్ కూడా ఇటీవలే మొదలయింది. కార్తీ ఫ్యాన్స్ కి అయితే బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ తో ట్రీట్ ఉండబోతుంది.ఖైదీ సినిమాను ప్రీక్వెల్లా ప్లాన్ చేస్తున్న లోకేష్, ఈ కథలో సూర్య చేసిన రోలెక్స్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్న హింట్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి రోలెక్స్ను మెయిన్ విలన్గా చూపించకపోయినా... ఫ్యూచర్లో ఆ పాత్ర నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.