కుబేరుడిని పట్టించుకోని నిర్మాతలు?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో, తమిళ నటుడు ధనుష్ నటిస్తున్న కుబేరుడు సినిమా గురించి మీరు వినే ఉంటారు. ఈ సినిమా మొదలయ్యి దాదాపు సంవత్సరకాలం పూర్తవుతుంది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయినట్టు విశ్వసినీ వర్గాల సమాచారం. దాంతో నిర్మాతలు సినిమా విడుదల చేయడానికి దారులు వెతుకుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దామంటే డేట్ కుదరడం లేదు అంటూ వారి సన్నిహితులు దగ్గర వాపోయినట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ప్రస్తుతం ఓటీటి హవా నడుస్తుండడంతో.. థియేటర్లో సినిమా పడాలంటే సరియైన సమయం చూసుకోవలసిన పరిస్థితి. అలాంటి మంచి సమయం కుబేరుడు సినిమాకి చిక్కడం లేదని సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా డీలా పడినట్టు సమాచారం.
అదెలా ఉంచితే, ఈ క్రేజీ కాంబినేషన్ కోసం ఓవర్గం సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శేఖర్ కమల సినిమా అంటే ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తారు. సింగిల్ థియేటర్లలో సినిమా పెద్దగా ఆడకపోయినా మల్టీప్లెక్స్ లలో సినిమా ఖచ్చితంగా ఆడుతుంది అనే నానుడి శేఖర్ కమ్ముల సినిమాలకు ఉంటుంది. అయితే ఈ కుబేరుడు సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని సినిమా మేకర్స్ చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు మంచి డేట్ కుదిరి... బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కుబేరుడు సాక్షిగా కురవాలని మనం కూడా ఆశిద్దాం.