వావ్: ప్రభాస్ ఫాన్స్ కి గుడ్ న్యూస్..రాజా సాబ్ నుంచి అప్డేట్..!

Divya
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవలే కల్కి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. సుమారుగా 1100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో రాబట్టి పలు రకాల రికార్డులను కూడా సృష్టిస్తోంది. కల్కి విజయం పైన ప్రభాస్ ఆభిమానులు ప్రస్తుతమైతే ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు.. కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాజా సాబ్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తూ ఉండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని గతంలో డైరెక్టర్ ప్రకటించారు.

ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతోందట.గతంలో ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ని కూడా చిత్రబృందం విడుదల చేశారు.. అయితే ఈ సినిమా అప్డేట్ల కోసం అభిమానులు చాలా ఏక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. తాజాగా నిర్మాణ సంస్థ నుంచి రాజా సాబ్ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ ని విడుదల చేశారు.. పాన్ ఇండియా గ్లింప్స్ రేపటి రోజున అంటే జూలై 29న సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.

దీంతో ప్రభాస్ అభిమానుల ఫుల్ ఖుషి చేసింది. రాజా సాబ్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని హర్రర్ కామెడీ జోనర్ల తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ వంటి వారు హీరోయిన్లుగా నటిస్తూ ఉన్నారు. అలాగే కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్, యోగి బాబు, బ్రహ్మానందం, సప్తగిరి వంటి వారు కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా 50% పూర్తి అయినట్లు తెలుస్తోంది. గతంలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని లీకులు కూడా బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఒక సినిమా పోస్టర్ ని కూడా చిత్రపరున విడుదల చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: