ఘట్టమనేని ఇంట్లో విషాదం.. మహేష్ బాబు మామ మృతి..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణతో తిరుగులేని క్రేజీ సంపాదించుకుంది ఘట్టమనేని  ఫ్యామిలీ. ఇక కృష్ణ కుమారుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోలలో ఒకరిగా తన కెరీర్ ని కొనసాగిస్తూ అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా భారీ చిత్రాలలో నటిస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో  విషాదం నెలకొంది.. అది కూడా ఘట్టమనేని కుటుంబంలో అన్నట్టుగా తెలుస్తోంది. వాటి గురించి చూద్దాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనమామ ప్రముఖ నిర్మాత అయినటువంటి సూర్యనారాయణ బాబు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ఈయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారట. నిన్నటి రోజున అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తృది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖుల సైతం ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణకు సూర్యనారాయణ బాబు వరుసకు బావ అవుతారట.

ఈయన రాయి రాబర్ట్ రహీమ్, బెజవాడ రౌడీ తదితర చిత్రాలకు సైతం నిర్మాతగా వ్యవహరించారు. అలాంటిది ఆయన ఇప్పుడు మృతి చెందిన వార్త తెలిసి అటు ఘట్టమనేని అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు . ఈ విషయాన్ని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిలర్ ట్విట్టర్ నుంచి అధికారికంగా తెలియజేశారు. ఈయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాని ఏడాది సినిమా షూటింగ్ మొదలుపెట్టే విధంగా కూడా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించారు మహేష్ బాబు. ఈ సినిమా అభిమానులను మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: