ఆర్తి అగర్వాల్ కెరియర్ అతనివల్లే నాశనం అయ్యిందా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్నది.. మొదటిసారి పాగల్ పన్ అనే చిత్రం ద్వారా మొదటిసారి బాలీవుడ్ పరిశ్రమకు పరిచయమైన ఆర్తి అగర్వాల్ డైరెక్టర్ కె విజయభాస్కర్ టాలీవుడ్ కి ఈమెను తీసుకువచ్చారు. వెంకటేష్ కి జంటగా నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది .తన మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ విజయం కావడం చేత ఆ తరువాత వెంటనే వరుసగా స్టార్ హీరోల చిత్రాలలో నటించే అవకాశాలు వెలుపడ్డాయట ఆర్తి అగర్వాల్.

ఇంద్ర సినిమా బ్లాక్ బస్టర్ విజయం అవడంతో ఒక్కసారిగా స్టార్ హీరోల చిత్రం నటించింది ఆర్తి అగర్వాల్. అయితే తరుణ్ కి జంటగా నువ్వు లేక నేను లేను, సోగ్గాడు, తదితర చిత్రాలలో నటించింది. వీరిద్దరి మధ్య చెప్పారు నడిచిందని వాదన కూడా ఎక్కువగా వినిపించేది. తరుణ్ ప్రేమాయణం వల్లే ఆర్తి అగర్వాల్ వివాహం చేసుకోకుండా ఎక్కువ రోజులు ఉందని కానీ కుటుంబం వీరి ప్రేమను వ్యతిరేకించింది అనే విధంగా వార్తలు వినిపించాయి.

ఆర్తి అగర్వాల్ కెరియర్ నాశనం చేసింది మాత్రం ఆమె తండ్రి నిర్మాత అంటూ చంటి అడ్డాల తెలియజేశారు. ఈయన మాట్లాడుతూ అల్లరి రాముడు సినిమాలో ఎన్టీఆర్ కి చార్మి నటించాల్సి ఉండగా.. కానీ ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నారు. అడవి రాముడు చిత్రం కూడా తమ బ్యానర్ లోనే చేశారని.. ఆర్తి అగర్వాల్ కూడా సెట్స్ లో చాలా హుషారుగానే ఉంటుంది అంటూ తెలిపారు.కానీ ఆమె తండ్రి వస్తే మాత్రం సైలెంట్ గా అయిపోతుంది అని తెలిపారు. ఆర్తి అగర్వాల్ మీద ఆమె తండ్రి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉండేదట. సినిమాల ఎంపిక విషయంలో కూడా తన తండ్రి నిర్వహించేవాడని.. వీటి వల్ల చాలా డిప్రెషన్ కి కూడా గురైందనీ చంటి ఎట్టాల తెలియజేశారు. అయితే చివరికి ఆమె బరువు పెరిగిపోయి షేప్ అవుట్ అవ్వడం వల్ల 2010 తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైంది. అలా అడపా దడపా సినిమాలలో నటించిన ఆర్తి అగర్వాల్ 2015లో లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: