మెగా అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన హరీష్ శంకర్..!!
తాను కూడా ఏదైనా పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడా అని అడిగినప్పుడు.. ఏదో పాన్ ఇండియా స్థాయి తీయాలని తాను తీయనని అన్నాడు. "పాన్ ఇండియా సినిమాలు సహజంగా జరిగిపోవాలి. ఏదో పాన్ ఇండియా మూవీ తీయాలి అని నేను తీయను. ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో లవ్ స్టోరీని నేను రాశాను. అది సినిమాగా చేస్తే దేశవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతేకాదు నేను పవన్ కల్యాణ్, చరణ్, చిరంజీవిల కోసం ఓ సబ్జెక్ట్ పై పని చేస్తున్నాను" అని హరీష్ శంకర్ చెప్పాడు.అసలుసిసలు పాన్ ఇండియా మూవీ అంటే ఏంటో చూపిస్తా అంటున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లతో ఓ మల్టీ స్టారర్ కోసం తాను కథ రాసుకున్నట్లు అతడు చెప్పడం విశేషం. పాన్ ఇండియా మూవీ తీయాలని తీయడం కాదు.. అది అలా జరిగిపోవాలని హరీష్ శంకర్ అన్నాడు.ఈ సినిమా గురించి చెబుతూ పాన్ ఇండియా మూవీల్లో అతిపెద్దది అవుతుందని అతడు అనడం విశేషం. "ఒకవేళ ఆ సినిమా తీస్తే.. అది అన్ని సినిమాలను మించిపోయి అతిపెద్ద పాన్ ఇండియా సినిమా అవుతుంది. అలాంటి సినిమాలను ప్లాన్ చేయలేము. అవి సహజంగా జరిగిపోవాలి.