కోటి కొట్టడానికి కూడా తనకలాడుతున్న రాజ్ తరుణ్.. ఇలాయితే కష్టమే?

Purushottham Vinay
కోటి కొట్టడానికి కూడా తనకలాడుతున్న రాజ్ తరుణ్.. ఇలాయితే కష్టమే? 

రాజ్ తరుణ్  హీరోగా 'పురుషోత్తముడు' అనే సినిమా రీసెంట్ గా విడుదల అయ్యింది.రామ్ భీమన డైరెక్ట్ చేసిన ఈ మూవీని 'శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్' సంస్థ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ లు నిర్మించారు.యంగ్ బ్యూటీ హాసిని సుధీర్.. రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది. జూలై 26న ఈ సినిమా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్స్ అంతా పర్వాలేదు అనిపించాయి. మరోపక్క లావణ్యతో వివాదం వల్ల రాజ్ తరుణ్ గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్న తరుణంలో రిలీజ్ అయిన సినిమా కాబట్టి ‘పురుషోత్తముడు’ మూవీపై ప్రేక్షకుల దృష్టి గట్టిగానే పడింది.అయితే మొదటి రోజు ఈ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.ఇక రెండో రోజు కూడా పికప్ అయ్యింది అంటూ ఏమీ లేదు. ఒకసారి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే.. ‘పురుషోత్తముడు’ సినిమా చాలా వరకు రెంటల్ పద్ధతిలోనే విడుదల చేశారు.


వాటి వాల్యూ మొత్తం రూ.1.22 కోట్లుగా ఉంది. కాబట్టి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి ఈ సినిమా రూ.1.8 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా కేవలం రూ.0.48 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా మరో రూ.1.32 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా కనీసం కోటి కూడా వసూలు చెయ్యడానికి అల్లాడుతుందంటే రాజ్ తరుణ్ ఎంత దారుణమైన స్టేజిలో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. 2016 దాకా రాజ్ తరుణ్ మార్కెట్ దాదాపు 20 కోట్ల దాకా ఉండేది. ఇప్పుడు కనీసం కోటి కూడా లేదు.వరుసగా మూడు హిట్లతో రాజ్ తరుణ్ కెరీర్ స్టార్టింగ్ లో మంచి ఊపులో ఉన్నాడు. కుమారి 21 F సినిమా దాకా రాజ్ తరుణ్ అంటే మినిమం గ్యారెంటి హీరో అని అనుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో రవి తేజ, నాని లాంటి హీరో అవుతాడని అంతా భావించారు. కానీ మూడే మూడు హిట్లతో మిగిలిపోతాడని అనుకోలేదు. ఒక మంచి కథతో వస్తే టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికైనా ఆదరిస్తారు.మరి రాజ్ తరుణ్ మంచి కథతో వచ్చి టాలీవుడ్ జనాలని మెప్పిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: