చికిత్స కోసం విదేశాలకు షారుఖ్ ఖాన్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Divya
బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందున షారుఖ్ ఖాన్ కంటి సమస్యకు సైతం చికిత్స తీసుకోవడం కోసం యూఎస్ఏ కు వెళ్లినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కంటి సమస్య బాగా ఇబ్బంది పెడుతూ ఉండడంతో ఇటీవలే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం చేరినట్లుగా తెలుస్తోంది షారుఖ్ ఖాన్.. దీంతో అక్కడి డాక్టర్లు శస్త్ర చికిత్స చేయాలని చెప్పడంతో వెంటనే కుటుంబంతో కలిసి యుఎస్ఏ కి షారుఖ్ ఖాన్ వెళ్లినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. 2014లో షారుక్ ఖాన్ కంటికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నట్లుగా తానే స్వయంగా తెలియజేశారు.

ఇప్పుడు మరొకసారి తన కంటి సమస్య రావడంతో షారుక్ ఖాన్ వెంటనే విదేశాలకు బయలుదేరారు. ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ షారుఖ్ అనారోగ్య సమస్యల నుంచి తొందరగా కోలుకోవాలని మాత్రం అభిమానులు తెలియజేస్తున్నారు. ఇటీవల షారుఖ్ ఖాన్ వరుసగా సరే కొత్త కదా అంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వరుసగా పఠాన్, జవాన్, డంకీ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు.

ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్ కారణంగా సినిమాలకు కాస్త విరామం ఇచ్చారని సమాచారం ప్రస్తుతం షారుఖ్ ఖాన్ వార్ -2 సినిమాలో నటిస్తున్నారట. ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు షారుక్ ఖాన్ మీద ఇలాంటి వార్త వినిపించడంతో అభిమానులు అయోమయంలో పడిపోయారు. మరి ఈ విషయం పైన అటు షారుఖ్ ఖాన్ కానీ అతని టీం కానీ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. అలాగే తన కూతురుతో కలిసి ఒక సినిమాల నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే తన కొడుకుని కూడా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు షారుఖ్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: