బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ పై పోలీస్ కేసు.. షాక్ లో ఫ్యాన్స్..!

Divya
తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో గురించి చెప్పాల్సిన పనిలేదు.. వీటికి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. అలా గుర్తింపు సంపాదించుకున్న వారిలో మెహబూబ్ దిల్ సే కూడా ఒకరు.. గతంలో మ్యూజిక్ వీడియోలు, డాన్స్ వీడియోలు చేస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకున్న మెహబూబ్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజేతగా నిలుస్తారనుకున్నారు. కానీ హౌస్ నుంచి బయటికి వచ్చాక నటుడుగా కూడా మారారు. అలా పలు టీవీ షోలలో కూడా డ్యాన్సులతో అందరిని ఆకర్షించారు మెహబూబ్.

ఇదంతా ఇలా ఉంటే సోమవారం రోజున మెహబూబ్ పుట్టిన రోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో కేక్ కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అంతేకాకుండా అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఒకపూట మంచి భోజనం అందించి తన గొప్ప మనసుని చాటుకున్నారు. అలాగే వారితో సరదా సరదాగా దిగిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది. అయితే తన పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. మెహబూబ్.. ఇదే తనని చిక్కుల్లో పడేసేలా చేసిందట.

మెహబూబ్ బర్తడే పార్టీలో పలువురు సెలబ్రిటీలతోపాటు బుల్లితెర నటినట్లు కూడా హాజరయ్యారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పార్టీ నిర్వహించారు అంటూ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే మెహబూబ్ తో పాటు రిసార్ట్ యజమాని మీద కూడా పోలీస్ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో ఒక రిసార్ట్లో ఈ పార్టీ జరిగినట్లు సమాచారం... ఎక్స్చేంజ్ అధికారులు అనుమతి లేనిచోట మద్యం తెచ్చుకుని తాగడం నేరమంటూ వీరి మీద కేసు నమోదు చేశారట. దాదాపుగా 11 లీటర్ల మద్యంతో పాటు ఏడు లీటర్ల బీర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ పార్టీలో కేవలం కొంతమంది మాత్రమే ఆల్కహాల్ సేవించాలని పోలీసులు తెలియజేశారు. ఇప్పటివరకు ఈ విషయం పైన మెహబూబ్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: