కుర్ర డైరెక్టర్ కు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. మళ్లీ రెండు భాగాలా..?
ఇదంతా ఇలా ఉండగా తాజాగా మరొక డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా యంగ్ డైరెక్టర్ కి అన్నట్లుగా సమాచారం. గత ఏడాది హాయ్ నాన్న అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ శౌర్యవ్ జూనియర్ ఎన్టీఆర్కు ఒక యాక్షన్ థ్రిల్లర్ కథ వినిపించారట. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఇంకా రెండేళ్ల సమయం ఉందని తెలిసినప్పటికీ 2026 లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలా ప్లాన్ చేసుకుంటున్నాట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మూడు భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నారు. అలాగే దేవర సీక్వెల్ తో పాటు బాలీవుడ్ లో వార్-2 , అలాగే ప్రశాంత్ నిల్ తో కూడా ఒక సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమాలన్నీ పూర్తి అయిన తర్వాతే యంగ్ డైరెక్టర్ శౌర్యవ్ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. 2026 లో ఈ సినిమా ఒకవేళ మొదలయితే 2028లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.అలాగే 2030వ సంవత్సరంలో రెండో భాగాన్ని విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించి ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారుతోంది.