టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా సినిమా 'డబుల్ ఇస్మార్ట్' ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడి అవుతున్నది.'ఇస్మార్ట్ శంకర్’ సినిమా మాస్ ప్రేక్షకులను బాగా మెప్పించడంతో ఈ సీక్వెల్పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలనేవి ఎర్పడ్డాయి.ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకి 'ఏ' సర్టిఫికెట్ లభించింది. ఇంటెన్స్ యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్తో మూవీని తీర్చిదిద్దామని, ఓల్డ్సిటీ శంకర్గా హీరో రామ్ యాక్షన్ మరో స్థాయిలో ఉంటుందని, ఇంటర్వెల్ బ్యాంగ్తో పాటు క్లెమాక్స్ ఘట్టాలు కూడా ఎవరూ ఊహించని రీతిలో సాగుతాయని ఈ మూవీ మేకర్స్ తెలిపారు. ఖచ్చితంగా రామ్ నట విశ్వరూపం చూస్తామని మేకర్స్ హింట్ ఇచ్చారు. అలాగే రామ్, కావ్యథాపర్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ కూడా స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుందని, మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు కూడా ఇప్పటికే పాపులర్ అయ్యాయని మూవీ యూనిట్ పేర్కొంది.
ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నది. పూరి జగన్నాథ్, ఛార్మికౌర్ ఈ సినిమాని నిర్మించారు.ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ లో కొత్త యాంగిల్ ను చూపించిందనే చెప్పాలి. కానీ ఈ సినిమా తరువాత అతను ఒక హిట్ పడితే మూడు నాలుగు ఫ్లాపులు చూస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత కూడా రెడ్, ది వారియర్, స్కంద అంటూ రామ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. ఇప్పుడు ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన స్థితిలో పూరీ జగన్నాథ్ తో కలిసి డబుల్ ఇస్మార్ట్ సినిమాతో వస్తున్నాడు. హీరోయిన్ కావ్య థాపర్ కు కూడా ఈ సినిమాతో తెలుగులో ఫస్ట్ హిట్ పడాల్సి ఉంది. అలాగే నిర్మాత ఛార్మీ తనపై వచ్చే కమెంట్స్ పోవాలంటే ఈ మూవీ హిట్ కావాలి. ఇంకా అలాగే ఈ చిత్రాన్ని విడుదల చేస్తోన్న ప్రైమ్ షో వాళ్లకూ ఇదో పెద్ద టాస్క్ అనే చెప్పాలి. వాళ్లు 55 కోట్లకు కొని ఈ మూవీని విడుదల చేస్తున్నారు. అయితే వాళ్లు కొన్నప్పుడు మాత్రం పెద్దగా పోటీ లేదు. కానీ ఇప్పుడు మిస్టర్ బచ్చన్, తంగలాన్, ఆయ్ లాంటి సినిమాలు ఉన్నాయి. కాబట్టి 55 కోట్లు రికవర్ అవడం అంత సులువేం కాదు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..