పాపం: వ్యభిచారం కేసులో చిక్కుకొని కెరియర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్.. లేకపోతే..?

Divya
చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు. మరి కొంతమంది ఈ పోటీ తట్టుకోలేక ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్లిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. మరి కొంతమంది వివాహాలు చేసుకుని సెటిల్ అయినవారు కూడా ఉన్నారు. మరి కొంతమంది మాత్రం  హీరోయిన్స్ కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఇండస్ట్రీకి దూరమైన వారు కూడా ఉన్నారు.. అలాంటి వారిలో హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ కూడా ఒకరు. మొదట చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా పేరు సంపాదించింది.

2002లో మాక్డి అనే చిత్రంతో మొదటిసారిగా బాలీవుడ్లోకి చైల్డ్ యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి తన కెరీర్ ని మొదలు పెట్టింది శ్వేతా బసు ప్రసాద్.. ఆ తర్వాత టీవీ షో లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కొత్త బంగారులోకం సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్ల కలల రాణిగా కూడా పేరు సంపాదించింది.
ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటున్న సమయంలో హైదరాబాదులో సెక్స్ రాకెట్లు పట్టు పడడంతో ఒకసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. 2014లో ఈమని సెక్స్ రాకెట్ కింద పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. కొన్ని నెలల పాటు రెస్క్యూ హోం లో కూడా ఈమెను తరలించారు.. ఆ తర్వాత బయటికి వచ్చిన శ్వేతా బసు ప్రసాద్.. అసలు విషయాన్ని చెప్పింది.ఒక ఈవెంట్ కోసం హైదరాబాద్కు వెళ్ళినప్పుడు తనపైన ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపింది. ఆ తర్వాత పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. మంచి స్టార్డం ఉన్న ఈ ముద్దుగుమ్మ కి సెక్స్ రాకెట్ లో చిక్కుకోవడంతో  ఈమె కెరియర్ కు బ్రేక్ పడిందని చెప్పవచ్చు.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే ఉన్నది శ్వేతా బసు ప్రసాద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: