మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ మిస్టర్ బచ్చన్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీ నేడు (ఆగస్టు 15) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది.ఇదిలావుండగా ఈ మధ్య కాలంలో ఇంకా సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాకముందే.. ఆయా సినిమాల ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న రవి తేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ పార్ట్నర్ కూడా ఫిక్స్ అయిపోయింది.థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా… థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని.. ఓటీటీ లో అడుగుపెట్టాల్సిందే. ఒకవేళ థియేటర్స్ లో ఆయా సినిమాలు అంతగా బజ్ సంపాదించుకోలేకపోయినా కూడా.. ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చాక మాత్రం.. విపరీతమైన బజ్ తెచ్చుకుంటున్నాయి. దీనితో మూవీ మేకర్స్ కూడా థియేట్రికల్ రిలీజ్ కు ముందే.. ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రవి తేజ నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ కూడా యాడ్ అయింది.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే.. ఈ చిత్ర స్ట్రీమింగ్ ఎప్పుడు అన్నది తెలియరాలేదు.ఇటీవల కాలంలో విడుదలైన అవుతున్న సినిమాల్లో చాలా సినిమాలో రిలీజైన మూడు నుంచి నాలుగు వారాల్లో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేస్తున్నాయి. ఈ లెక్కన మిస్టన్ బచ్చన్ కూడా ఇలాగే స్ట్రీమింగ్ కానుంది. ఎన్ని రోజులు వెయిట్ చేయాలనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.ఈ క్రమంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను గురించి భారీ డిస్కషన్ ఏ జరిగింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘మిస్టర్ బచ్చన్’ రైట్స్ రూ.19.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అది కాస్త ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది.