జిమ్ములో బాలయ్య చేసిన పనికి షాక్లో ఫ్యాన్స్.. విడియో వైరల్..!

Divya
నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో సక్సెస్ అవుతూ బిజీగా ఉన్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే హిందూపురం ఎమ్మెల్యేగా కూడా బాలయ్య హ్యాట్రిక్  విజయాన్ని అందుకున్నారు. బాలయ్య  ముఖ్యంగా అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారితో కలిసి ముందుకు వెళుతూ ఉన్నారు బాలయ్య. ఈరోజు తాజాగా తన సొంత నియోజకవర్గమైన హిందూపురాన్ని పర్యటించడం జరిగింది. ఈ సందర్భంలో బాలయ్య అభిమానులనే కాకుండా ప్రజలను కార్యకర్తలను కూడా దగ్గరికి చేర్చుకోవడం జరిగింది. అలాగే ఒక జిమ్ సెంటర్ ని కూడా బాలయ్య ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఆద్యములో కాసేపు కసరత్తులు చేస్తూ సందడి చేశారు అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారడంతో ఈ వీడియోలో బాలయ్య అభిమానులు జై బాలయ్య అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. ఈ వయసులో కూడా మా బాలయ్య జిమ్ములో ఇలా కష్టపడడం చూసి అభిమానులు తెగ కేకలు వేస్తూ ఉన్నారు. ఈ వీడియో చూసి పలువురు అభిమానులు మరింత ఆశ్చర్యపోతున్నారు. అనంతరం బాలయ్య స్థానిక ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ సైతం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో బాలయ్య తో పాటు కలెక్టర్ చేతన్ కూడా పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ నిరుపేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్ ని  తిరిగి ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. పేదల ఆకలి తీర్చేందుకు అప్పట్లో ఎన్టీఆర్ కేవలం రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని ఇచ్చారు అంటూ తెలియజేశారు. చంద్రబాబుకు కూడా హిందూపురం అంటే చాలా ప్రత్యేకమైన అభిమానమని కూడా తెలియజేశారు. అనంతరం జిమ్ములో ఇలా బాలయ్య చేసిన కసరత్తులకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా పసుపు కండువా ధరించి ఇలాంటి కసరత్తులు చేయడం జరిగింది బాలయ్య. డైరెక్టర్ బాబి సినిమాలో  నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: