పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. చాన్నాళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ను ప్రారంభించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అయితే.. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ను తిరిగి ప్రారంభించారు. ఆగస్టు 14 (బుధవారం) నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని చిత్ర బృందం తెలియజేసింది.ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలిపింది. 400 నుంచి 500 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు ఈ భారీ యుద్ధ సన్నివేశ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని మూవీ యూనిట్ తెలియజేసింది.వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ టార్గెట్ గా తెరకెక్కుతోంది. అయితే డిసెంబర్ నెలలో విడుదల కావడానికి ఇప్పటికే పలు క్రేజీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. వీరమల్లు మూవీలో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేయనున్నారని తెలుస్తోంది. పవన్ త్వరలో షూటింగ్స్ లో పాల్గొననుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం 2025 ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉందని వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయనే సంగతి తెలిసిందే. బాబీ డియొల్ , అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా ఫ్యాన్స్ అంచనాలను మించి ఉంటుందేమో చూడాలి.పవన్ కళ్యాణ్ పుట్టినరోజున హరిహర వీరమల్లు మూవీ నుంచి అప్ డేట్ తో పాటు రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. హరిహర వీరమల్లు సినిమాకు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తుండటం గమనార్హం. ఈ సినిమాలో సాంగ్స్ సైతం స్పెషల్ గా ఉండనున్నాయని తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.