ఆ విషయంపై క్లారిటీ ఇవ్వడం కోసమే ఎన్టీఆర్ అలా చేసాడా..?
దానితో అభిమానులు ఆందోళనపడిపోయారు. ఎన్టీఆర్ యాక్సిడెంట్ వార్తలపై ఎన్టీఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. ఆయన జిమ్ చేస్తుండగా ఎడమ చేతికి కొన్నిరోజుల క్రితం చిన్న గాయం అయ్యింది. అది చాలా చిన్న గాయమే. అందుకే ఆయన దేవర షూటింగ్లో మంగళవారం కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయకు పెద్ద ప్రమాదం జరిగినట్టుగా వస్తున్న వార్తలు నమ్మొద్దు, ఆ రూమర్స్ ని అభిమానులు నమ్మకండి అని ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది.ఈ నేపథ్యంలో తాజాగా శనివారం ఎన్టీఆర్ తన బావమరిది నటించిన ‘ఆయ్’ చిత్రం టీమ్ను తన ఆఫీసుకు పిలిపించుకుని వారిని అభినందించి.. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను మీడియాకు వదిలారు. ఎన్టీఆర్ కలిసిన వారిలో హీరో నార్నే నితిన్, అంకిత్ కొయ్య, సారికతో పాటు నిర్మాత బన్నీవాస్, ఎస్కెఎన్, దర్శకుడు అంజి తదితరులు కూడా వున్నారు. అంతేకాదు ఈసినిమాకు వస్తున్న పాజిటవ్ రెస్పాన్స్కు వాళ్లకు ఆల్దిబెస్ట్ చెప్పారు ఎన్టీఆర్.
ఇక తారక్ లాంటి స్టార్హీరో పిలిచి తమను అభినందించే సరికి ఆయ్ టీమ్ కూడా ఎంతో సంతోషంగా వుంది. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం మరొకటి వుంది. తన యాక్సిడెంట్పై వస్తున్న వార్తలకు, తన ప్రమాద తీవ్రతపై వస్తున్న గాసిప్స్కు కూడా ఎన్టీఆర్ ఈ అభినందనతో చెక్ పెట్టేశాడు. ఇక ఎన్టీఆర్ కేవలం చేతికి ఓ చిన్నకట్టుతో కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు బయటికి వచ్చేసరికి ఎన్టీఆర్ అభిమానులు కూడా మా హీరో సూపర్గా వున్నాడు.. అంటూ సంతోషపడతున్నారు. అంతేకాదు ఇలా పరోక్షంగా చెప్పడానికే ఎన్టీఆర్ ఈ అకేషన్ను కూడా యూజ్ చేసుకున్నాడని అంటున్నారు మరికొంత మంది.ఇదిలావుంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ పూర్తి చేసుకుని బ్రేక్ లో ఉన్నాడు. ప్రస్తుతం చిన్నపాటి గాయం నుంచి కోలుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. నటుడు దేవర ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు మరియు అతను త్వరలో వార్ 2 సెట్స్లో చేరనున్నాడు, ఇందులో హృతిక్ రోషన్ ఇతర ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఈ ఏడాది ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ని ఎన్టీఆర్ ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.