పూరీకి కలిసి రావడం లేదా.. లైగర్ కంటే కూడా.. పెద్ద దెబ్బే.. !

Divya
డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ తాజాగా రామ్ పోతినేని హీరోగా తెరకెక్కించిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ ఇది. అందుకే అదే తరహాలో డబుల్ ఇస్మార్ట్ అంటూ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని ప్రయోగం చేశారు. కానీ ఈసారి మాత్రం బెడిసి కొట్టింది. డబుల్ ఇస్మార్ట్ సినిమాకి వీకెండ్ ఎలాగోలా కలిసి వచ్చినా.. వీక్ డేస్ కి మొత్తం దెబ్బ పడిందని చెప్పవచ్చు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. డబుల్ ఇస్మార్ట్ సినిమాకి రూ.50 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని వార్తలు వచ్చాయి. మరొకవైపు పూరీ  జగన్నాథ్ చివరి సినిమా విజయ్ దేవరకొండ తో లైగర్ తెరకెక్కించారు. ఈ సినిమా ఘోరమైన పరాభవాన్ని చవిచూసి చూసింది. ఈ నష్టాలు పూడ్చాలని నైజాం డిస్ట్రిబ్యూటర్లు,  వరంగల్ శ్రీను వంటి వారు నిరసనలు కూడా చేశారు. ఎంతోకొంత తిరిగి ఇస్తామని చెప్పారు. అలా ఏదోలా సినిమా అయితే బయటకు వచ్చింది కానీ మొదటి ఆటతోనే సినిమా తేడా కొట్టేసిందని అందరికీ కూడా అర్థం అయిపోయింది..
ఇకపోతే పూరీ జగన్నాథ్ గత చిత్రం లైగర్ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచినా.. ఈ సినిమా కంటే కూడా దారుణంగా డబుల్ ఇస్మార్ట్ ప్లాప్ కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక తాజాగా  జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మినిమం వసూలు కూడా నమోదయ్యే పరిస్థితి కనిపించడం లేదు.  ఈ సినిమా ఇప్పటివరకు మొత్తంగా కేవలం రూ.12 కోట్ల షేర్ రాబట్టిందని బాక్సాఫీస్ వద్ద వార్తలు వినిపిస్తున్నాయి.  దీన్నిబట్టి చూస్తే లైగర్ సినిమా తోనే దెబ్బ పడింది అంటే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా అంతకంటే పెద్ద దెబ్బ వేసిందని చెప్పవచ్చు.ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే పాన్ ఇండియా చిత్రాలంటూ తెరకెక్కిస్తున్న  పూరీ జగన్నాథ్ కి ప్రస్తుతం కలిసి రావడం లేదని వార్తలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: