గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో వసూళ్లు రాబట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే యాక్టింగ్ కు
మూవీ లవర్స్
ఫిదా అయిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో
కల్కి పైన,
ప్రభాస్ పైన
బాలీవుడ్ నటుడు
అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు
టాలీవుడ్ నటులు కూడా దీనిపై స్పందించారు. ఇక ఇప్పుడు
డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ కామెంట్స్ పై ఆసక్తి కరమైన పోస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్
మీడియా లో
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ.. చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ ను,
కల్కి సినిమాను కామెంట్స్ చేయడంతో.. నెటిజన్లు అర్షద్ పై మండిపడుతున్నారు.
టాలీవుడ్ సినిమాల సత్తా
బాలీవుడ్ లో కనిపించడంతో.. తట్టుకోలేక ఇలా మాట్లాడుతున్నారని కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో పలువురు
టాలీవుడ్ నటి నటులు కూడా అర్షద్ వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్ట్స్ చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా
డైరెక్టర్ నాగ్ అశ్విన్ దీని పై స్పందించారు. నాగ్ ఈ విషయం పై మాట్లాడుతూ.. “ఫిల్మ్
ఇండస్ట్రీ ని వెనక్కు లాగొద్దు..
బాలీవుడ్ ,
టాలీవుడ్ అనే బోర్డర్స్ చెరిగిపోయాయి. దేశం మొత్తం
సినిమా ఒక్కటే అనే దృష్టితోనే ఫిల్మ్ ఇండస్ట్రీని చూడాలి. అర్షద్ కాస్త హుందాగా మాట్లాడాల్సింది. అయినా పర్లేదు మేము అతని పిల్లల కోసం..
కల్కి బుజ్జి టాయ్స్ పంపిస్తాము.
కల్కి -2 కోసం మరింత కష్టపడి పనిచేస్తాను. అందులో
ప్రభాస్ ను బెస్ట్ గా చూపిస్తాను.” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.