అమ్మ కల తీర్చిన జూనియర్ ఎన్టీఆర్.. బెస్ట్ గిఫ్ట్ ఇదేనంటూ ట్వీట్..!

Divya
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు.అప్పుడప్పుడు వెకేషన్ కి కూడా వెళ్లిన సందర్భాలు మనకి కనిపిస్తూనే ఉంటాయి.. సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో గడపడానికి అంతే సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా తన తల్లి షాలిని విషయంలో కూడా ఎలాంటి విషయాలనైనా సరే నిర్మొహమాటం లేకుండా తెలియజేస్తూ ఉంటారు. తాజాగా తన తల్లి కల నిజమయింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ని షేర్ చేశారు. వాటి గురించి చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఎన్టీఆర్,రిషబ్ శెట్టి తో పాటు తన తల్లిని తీసుకొని ఉడిపికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ అమ్మవారిని సైతం దర్శించుకుని తన తల్లితో కలిసి కలిసి ఉన్న ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్టుని తెలియజేశారు.. మా అమ్మ ఎప్పుడు కూడా తన సొంత ఊరు కుందాపూర్ తో పాటు ఉడిపి శ్రీకృష్ణుని దర్శనం చేయించాలని ఎన్నోసార్లు కలలు కంటూ ఉండేది.. ఆ కలని ఈ రోజున నిజం చేశానంటూ తెలియజేశారు. సెప్టెంబర్ 2న ఆమె పుట్టినరోజు కావడం చేత తాను ముందుగానే ఇక్కడికి వచ్చి పెద్ద గిఫ్ట్ ఇచ్చానని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్.

అలాగే విజయ్ కిరంగదూర్ మీకు ధన్యవాదాలు అంటూ తెలియజేశారు. అలాగే తన ప్రియమైన మిత్రుడు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి తో ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందంటూ తెలియజేశారు. ఇందులో భాగంగా ఆ గుడిలో జరిగినటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయగా మరికొన్ని ఫోటోలు అభిమానులు సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్ర షూటింగ్లో ఉన్నారు. ఈ చిత్రం అయిపోగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరొక చిత్రాన్ని చేయబోతున్నారు. బాలీవుడ్ లో కూడా వార్ చిత్రంలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: