కాంతారా సెట్స్ లో మెరిసిన ఎన్టీఆర్... రిషబ్ శెట్టి ఏం ప్లాన్ చేసాడో..?

murali krishna
కేజీఎఫ్’ చిత్రం తరువాత కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఎటువంటి అంచనాలు లేకుండా ఒక సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చి ఇండియా వైడ్ భారీ విజయాన్ని చేసుకున్న చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో సప్తమి గౌడ్ హీరోయిన్ గా నటించారు. కేవలం 25 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ చిత్రం ఇంతటి బ్లాక్ బస్టర్ అవ్వడంతో సెకండ్ పార్ట్ ని కూడా తీసుకు రావాలని మేకర్స్ భావించారు.అయితే సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ని సిద్ధం చేస్తున్నారు. కాంతార సినిమా హీరో తండ్రి పాత్ర ముగియడంతో మొదలవుతుంది. ఇప్పుడు ఆ తండ్రి పాత్రని మొదలుగా తీసుకోని కాంతార 2ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథ కొన్ని వందల ఏళ్ళ క్రితం జరిగిన పంజుర్లి దైవ కథతో పీరియాడిక్ సినిమాగా ఉండబోతుందని సమాచారం. కాంతార 2 కోసం చాలా రీసర్చ్ చేసిన రిషబ్ శెట్టి.. ఆల్రెడీ షూటింగ్ మొదలుపెట్టి చిత్రీకరణ జరుపుతున్నారు. తాజాగా ఈ మూవీ గురించిన అప్డేట్ ని మేకర్స్ తెలియజేశారు.కాంతార సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి 100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది బ్యానర్. అందుకే భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు రిషబ్ శెట్టి.

ఈ మూవీ కోసం కర్ణాటకలోని ఉడిపి ప్రాంతంలో ఉన్న కుందాపురలో ఓ భారీ సెట్ వేశారట. కన్నడ సినిమా హిస్టరీలోనే ఇంత పెద్ద సెట్ లేదు అంటున్నారు కొంతమంది. మరికొందైతే రామోజీ ఫిల్మ్ సిటీ రేంజ్ లో నిర్మించారు అంటున్నారు. అఫ్ కోర్స్ వాళ్లెవరూ రామోజీ ఫిల్మ్ సిటీ చూసి ఉండరు.. అందుకే అలా అని ఉంటారు కానీ.. వారి ఉద్దేశ్యం మాత్రం అంత పెద్దది అని అర్థం చేసుకోవాలి. రీసెంట్ గా ఎన్టీఆర్ తన తల్లి మొక్కు కోసం అంటూ ఆమె సొంత ఊరైన కుందాపురకు వెళ్లాడు కదా. అప్పుడే రిషబ్ శెట్టి ఈ సెట్ లోకి ఎన్టీఆర్ ను కూడా తీసుకువెళ్లి చూపించాడట. వీరితో పాటు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడని ఆ ఫోటోస్ చూశాం కదా. రిషబ్ కు ఎన్టీఆర్ అంటే అభిమానం. అందుకే తను డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తోన్న మూవీ కోసం వేసిన భారీ సెట్ ను చూసేందుకు తారక్ ను తీసుకువెళ్లాడట. మొత్తంగా ప్రస్తుతం ఈ సెట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద శాండల్ వుడ్ గా మారడం విశేషం.హోంబేలె ఫిలిమ్స్ ఈ సినిమాని చాలా గ్రాండ్ గా నిర్మిస్తుంది. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించబోతున్నారట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇంకే స్టార్ కాస్ట్ కనిపించబోతుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: