చిరు కోసం ఇద్దరు తమిళ దర్శకులు.. సెట్ అయితే క్రేజ్ మామూలుగా ఉండదు..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సోషియో ఫాంటసీ జోనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. యు వి క్రియేషన్స్ బ్యానర్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

విశ్వంభర మూవీ చివరి దశకు వచ్చినా కూడా చిరంజీవి తన తదుపరి మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే ఓ ఇద్దరు తమిళ దర్శకులు మాత్రం చిరంజీవి నెక్స్ట్ మూవీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కోసం తమిళ దర్శకుడు మోహన్ రాజా ఓ కథను రెడీ చేస్తున్నట్లు ఆల్మోస్ట్ ఆ కథ చివరి దశకు వచ్చినట్లు మరికొన్ని రోజుల్లోనే ఆ కథను చిరంజీవి కి వినిపించనున్నట్లు ఒక వేళ చిరంజీవి కి గనక ఆ స్టోరీ నచ్చినట్లయితే మోహన్ రాజా దర్శకత్వంలో చిరు నెక్స్ట్ మూవీ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక మోహన్ రాజా మాత్రమే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న లోకేష్ కనకరాజు కూడా చిరంజీవి తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ అన్ని కుదిరితే లోకేష్ కనకరాజు కూడా చిరు తో మరికొన్ని రోజుల్లోనే ఓ మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఈ ఇద్దరు తమిళ దర్శకులు చిరంజీవి తో సినిమా చేయడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: