సిద్దార్థ మొదటి భార్య ఎవరు.. విడాకులు ఎందుకు తీసుకున్నారు ?

Veldandi Saikiran
హీరో సిద్ధార్థ్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. బాయ్స్ సినిమాతో తన కెరియర్ ప్రారంభించి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్నారు. శంకర్ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. అతితక్కువ సమయంలోనే సిద్ధార్థ్ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయాడు. 2005లో వచ్చిన నువ్వోస్తానంటే నేనొద్దంటానా సినిమాతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది.

దీంతో సిద్ధార్థ్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో సిద్ధార్థ్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇదిలా ఉండగా.....సిద్ధార్థ్ వ్యక్తిగత విషయానికి వస్తే.... అతని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ హీరోకి వివాహమైందన్న విషయం కూడా పెద్దగా ఎవరికి తెలియదు. సిద్ధార్థ్ కి 2003 సంవత్సరంలోనే వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. అయితే సిద్ధార్థ్ మాత్రం ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తాడు. సిద్ధార్థ్ మొదట తన పక్కింట్లో ఉండే అమ్మాయి మేఘనను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య ఏవో గొడవల కారణంగా 2007లో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం సిద్ధార్థ్ కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ తో ప్రేమలో ఉన్నాడని అనేక రకాల రూమర్స్ వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ సమంతతో కొన్ని రోజులు పాటు ప్రేమాయణం కొనసాగించాడు. వీరిద్దరూ కలిసి కొన్ని చోట్ల ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించారు.

ఏమైందో తెలియదు వీరు కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత గత కొన్నేళ్ల నుంచి సిద్ధార్థ్ హీరోయిన్ అదితిరావు హైదరితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నాడు. సిద్ధార్థ్, అదితి ప్రేమించుకొని వారి రిలేషన్ కొనసాగించిన ఈ జంట వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో సింపుల్ గా జరుపుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నారు. ఈ ఫోటోలు చూసిన చాలామంది కొత్తజంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: