పూరి జగన్నాధ్ కింద పడుకొని మీద ఎక్కమన్నాడు.. ఆర్జీవి బ్యూటీ షాకింగ్ కామెంట్స్.?

Pandrala Sravanthi
 టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో ఒకరైన పూరి జగన్నాథ్ పై ఆర్జీవి బ్యూటీ శ్రీ రాపాక చేసిన కామెంట్లు ప్రస్తుతం మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవ్వడంతో వీళ్ళిద్దరికీ ఏమైనా రిలేషన్ ఉందా ఏంటి అనే కోణంలో కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ శ్రీ రాపాకకి పూరి జగన్నాథ్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన నగ్నం మూవీతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది నటి శ్రీ రాపాక.ఈ సినిమాలో చాలా బోల్డ్ గా నటించి అందరిని అట్రాక్ట్ చేసింది.ఇక ఆ తర్వాత మరణం,గులాబీ వంటి సినిమాల్లో నటించినప్పటికీ అంత గుర్తింపు అయితే రాలేదు.అయితే ఈ హీరోయిన్ బిగ్ బాస్ లోకి కూడా వెళ్ళింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గురించి మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఇంతకీ పూరి జగన్నాథ్ గురించి శ్రీ రాపాక ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం.

 శ్రీ రాపాక పూరి జగన్నాథ్ గురించి మాట్లాడుతూ... నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆఫీస్ కి ప్రతిరోజు వెళ్తూ ఉండేదాన్ని. అయితే అక్కడ ఆయన చేసిన పనికి నేను షాక్ అయ్యేదాన్ని. ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీలు, డబ్బున్నవాళ్లు కిందికి దిగరు. నేలమీద కూర్చోరు.కానీ పూరి జగన్నాథ్ సార్ మాత్రం నేల మీదే పడుకునేవారు. ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్లడంతో ఆయనకు నేను చాలా క్లోజ్ అయిపోయాను.ఇక నేను అప్పుడప్పుడు ఇంటికి వెళ్లిన సమయంలో పూరి జగన్నాథ్ కింద పడుకుంటే ఆయన కాళ్ళ మీదకి ఎక్కి నన్ను తొక్కమనేవారు.అలా నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది.

అంతేకాదు నేను ఏమి అడిగినా లేదనుకుంటా ఇచ్చేవారు. అంతే కాదు ఏదైనా లేదంటే అడిగి మరీ తీసుకోమనేవారు. ఇక పోకిరి సినిమా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సమయంలో మహేష్ బాబు,ప్రకాష్ రాజ్ ఇద్దరూ అక్కడికి వచ్చేవారు. ఆ టైంలో మహేష్ బాబు నన్ను చూసి ఈమె ఎవరు పిల్ల బచ్చా కొత్తగా ఇక్కడ కనిపిస్తుంది అని అనేవారు అంటూ మహేష్ బాబు,పూరి జగన్నాథ్ ల గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది శ్రీ రాపాక. అయితే ఈమె మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో పూరి జగన్నాథ్ కాళ్ళు నొక్కడమేనా ఇంకా ఏదైనా రిలేషన్ ఉందా అంటూ కొంతమంది నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: